టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, తన తదుపరి చిత్రం కోసం ఒక సాలిడ్ బ్యాక్డ్రాప్ను ఎంచుకున్నారు. ‘రౌడీ ఫెలో’, ‘ఛలో మోహన రంగ’, రీసెంట్గా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘పవర్ పేట’ (Power Peta) సినిమా పట్టాలెక్కబోతోంది. ఈ చిత్రం ఒక పీరియడ్ డ్రామాగా, రాజకీయ, గ్యాంగ్స్టర్ ఎలిమెంట్స్ నేపథ్యంలో సాగనుందని సమాచారం. గతంలో ఈ కథపై చాలా చర్చలు జరిగాయి కానీ, చివరకు సందీప్ కిషన్ ఈ ప్రాజెక్ట్ను ఓకే చేశారు. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో సందీప్ కిషన్ సరసన హీరోయిన్గా..
Also Read : Vijay Deverakonda : ప్రధాని మోదీకి ‘విరోష్’ పెళ్లి పిలుపు.. హైదరాబాద్ రిసెప్షన్కు ముఖ్య అతిథిగా పీఎం?
‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ఫేమ్ రితికా నాయక్ ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాలో కథానాయిక పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందట.. అందుకని రితికా నాయక్ అయితేనే సరైన న్యాయం చేస్తుందని చిత్ర యూనిట్ భావించింది. విజువల్స్ పరంగా, టెక్నికల్ పరంగా ఈ సినిమా చాలా గ్రాండ్గా ఉండబోతోందని తెలుస్తోంది. కృష్ణ చైతన్య మార్క్ డైలాగ్స్, సందీప్ కిషన్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ కాంబినేషన్ పై ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయి.
