టాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీపై భారీగా అంచనాలు వున్నాయి.’పుష్ప’ పార్ట్ 1 వచ్చి రెండున్నర ఏళ్లు అవుతుంది.. ఇంకా మూవీని రిలీజ్ చేయకపోవడం పై ఫ్యాన్స్ కాస్త అసహనంతో ఉన్నారు. దానికి తోడు మూవీ షూటింగ్ కూడా స్లోగా సాగుతుంది. పైగా అప్డేట్స్ కూడా పెద్దగా రావడం లేదు.గతంలో ఎప్పుడో ఫస్ట్ గ్లింప్స్ వదిలి దర్శకుడు సుకుమార్..ఫ్యాన్స్ ని ఖుషి చేశారు.గ్లింప్స్ వీడియోతోనే ఈ సినిమాపై మూవీ లవర్స్ లో క్యూరియసిటీ పెంచేసారు.. ఆ హడావుడి చూసి 2023లోనే మూవీ థియేటర్లో కి వస్తుందని అంతా అనుకున్నారు..తీరా చూస్తే 2024 ఆగష్టు 15 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.. దీంతో మూవీ లవర్స్ ‘పుష్ఫ 2’ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలో డైరెక్టర్ సుకుమార్ తాజాగా ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ‘పుష్ప 2’ విశేషాలను పంచుకున్నారు.ఈ సందర్భం గా సుకుమార్ మాట్లాడుతూ.. “ఫ్యాన్స్ కు ప్రామిస్ చేస్తున్నా. ‘పుష్ప’ కంటే ‘పుష్ప 2’ అంతకు మించి ఉంటుంది. పార్ట్ 2 సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా వచ్చింది. ‘భన్వర్ సింగ్ షెకావత్ మరియు పుష్పల మధ్య జరిగే సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ చాలా ఇంటెన్సివ్ గా ఉండబోతున్నాయి. అలాగే పుష్పరాజ్ కి ఎదురయ్యే సమస్యలు.. దాన్ని అతను ఎదుర్కొన్న తీరు చాలా అద్భుతంగా ఉంటుంది” అని ఆయన చెప్పుకొచ్చారు.అలాగే ‘పుష్ప 2’ సినిమాటోగ్రఫీ పై తనకు చాలా నమ్మకం ఉందని, ఖచ్చితంగా పార్ట్ 2 ప్రేక్షకుల అంచాలను మించి ఉంటుందని ఆయన తెలిపారు.. సుకుమార్ కామెంట్స్ తో మూవీపై అంచనాలు నెక్ట్స్ లెవల్ కు చేరుకున్నాయి.