Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ నూతన సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ సీఎం పదవి ఎవరిని వరిస్తుందో అన్నదానికి తెరపడింది. సుఖ్విందర్ సింగ్ సుఖు కొత్త సీఎంగా రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. శనివారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయనను రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. దీనిపై పార్టీ పరిశీలకుల్లో ఒకరైన చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పరిశీలకుడు భూపేశ్ భగేల్ స్పందిస్తూ, సీఎం ఎంపిక నిర్ణయాధికారాన్ని సీఎల్పీ అధిష్టానికే అప్పగించడంతో, హైకమాండ్ సుఖు పేరును ఖరారు చేసిందన్నారు. ఇంతకుముందున్న బీజేపీ ప్రభుత్వంలో అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా ఉన్న ముకేశ్ అగ్నిహోత్రి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారని తెలిపారు. సీఎం పదవి కోసం సుఖు సహా నలుగురు నేతలు పోటీలో ఉండటంతో సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో పార్టీ సాంప్రదాయం ప్రకారం ఏక వాక్యతీర్మానం చేసి సీఎం ఎంపికను అధిష్టానానికే వదిలేశారు. హిమాచల్ ప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రిని అధిష్టానమే ఎంపిక చేయాలని ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానించారని రాజీవ్ శుక్లా చెప్పారు.
Read Also: Mahesh Babu : మహేశ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది
Also Read
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
సీఎం పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపు (డిసెంబరు 11) ఉదయం 11 గంటలకు జరగనుందని భగేల్ తెలిపారు. కాగా, హిమాచల్ ప్రదేశ్ సీఎం రేసులో పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్ పేరు బలంగా వినిపించినా, పార్టీ అధిష్ఠానం సుఖ్విందర్ సింగ్ వైపే మొగ్గుచూపింది. సుఖ్విందర్ సింగ్ సుఖు నాదౌన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా పనిచేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుఖ్విందర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఆయన కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ యూఐ నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. కాగా, 68 స్థానాలున్న హిమాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 40 స్థానాలు సాధించగా బీజేపీ 25 స్థానాలు దక్కించుకున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?