Delhi: ఢిల్లీలోని డీటీసీ బస్సుకు బాంబు బెదిరింపు.. దర్యాప్తులో షాకింగ్ వాస్తవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీలోని నాంగ్లోయ్ నుండి శనివారం రాత్రి సెంట్రల్ పార్క్ నజాఫ్గఢ్ రోడ్లోని డిటిసి క్లస్టర్ బస్సులో బాంబు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతమంతా భయాందోళనలకు గురయింది. సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. బాంబు కాల్పై విచారణ జరిపిన తర్వాత, బస్సులో అనుమానాస్పద వస్తువు ఉందని రాత్రి 9.53 గంటలకు మాకు కాల్ వచ్చిందని డిసిపి ఔటర్ జిమ్మీ చిరం తెలిపారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ను పిలిపించి విచారణ చేపట్టినా అలాంటిదేమీ లభించలేదు. ఎన్ఎస్జీ బృందం కూడా ఘటనాస్థలికి చేరుకుంది.
Read Also:Jishnu Dev Varma: తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ..
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
అయితే వైర్ను పోలిన అనుమానాస్పద వస్తువును స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆ విషయం ఏంటనేది బీడీఎస్ బృందాలు ఆరా తీస్తున్నాయి. విచారణ అనంతరం బాంబులాంటి వస్తువులు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. నంగ్లోయ్ నుండి నజాఫ్గఢ్ రహదారిపై బకర్వాలా సిఎన్జి పంప్ సమీపంలోని నరేలా ప్రాంతంలోని చంచల్ పార్క్ వద్ద బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. రూట్ నంబర్ 961 (నాగ్లోయ్ నుండి నజాఫ్గఢ్ రహదారి) క్లస్టర్ బస్సులో బాంబు ఉన్నట్లు అనుమానం వచ్చింది.
Read Also:Delhi : ఢిల్లీలో దారుణం.. కోచింగ్ సెంటర్లోకి నీళ్లు వచ్చి ముగ్గురు విద్యార్థులు మృతి
మేము బాంబు లాంటిది చూశాము: బస్ కండక్టర్
ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేసిన బస్సు కండక్టర్ దివాన్ సింగ్, మేము నంగ్లోయ్ నుండి బయలుదేరామని చెప్పాడు. తిలాంగ్పూర్ కోట్లా వద్ద 10-12 మంది ప్రయాణికులు దిగారు. అప్పుడు మేము వారి సీట్ల క్రింద బాంబు లాంటిది చూశాము. మేము బస్సును ఆపి, మిగిలిన ప్రయాణికులను క్రిందికి దింపమని అడిగాము. అప్పుడు మేము 100 నంబర్కు డయల్ చేసాము. అనంతరం సమాచారం అందుకున్న పీసీఆర్ బాంబు నిర్వీర్య బృందానికి ఫోన్ చేశారు.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?