Delhi: ఢిల్లీలోని డీటీసీ బస్సుకు బాంబు బెదిరింపు.. దర్యాప్తులో షాకింగ్ వాస్తవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీలోని నాంగ్లోయ్ నుండి శనివారం రాత్రి సెంట్రల్ పార్క్ నజాఫ్గఢ్ రోడ్లోని డిటిసి క్లస్టర్ బస్సులో బాంబు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతమంతా భయాందోళనలకు గురయింది. సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. బాంబు కాల్పై విచారణ జరిపిన తర్వాత, బస్సులో అనుమానాస్పద వస్తువు ఉందని రాత్రి 9.53 గంటలకు మాకు కాల్ వచ్చిందని డిసిపి ఔటర్ జిమ్మీ చిరం తెలిపారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ను పిలిపించి విచారణ చేపట్టినా అలాంటిదేమీ లభించలేదు. ఎన్ఎస్జీ బృందం కూడా ఘటనాస్థలికి చేరుకుంది.
Read Also:Jishnu Dev Varma: తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ..
Also Read
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
- Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
- Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
అయితే వైర్ను పోలిన అనుమానాస్పద వస్తువును స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆ విషయం ఏంటనేది బీడీఎస్ బృందాలు ఆరా తీస్తున్నాయి. విచారణ అనంతరం బాంబులాంటి వస్తువులు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. నంగ్లోయ్ నుండి నజాఫ్గఢ్ రహదారిపై బకర్వాలా సిఎన్జి పంప్ సమీపంలోని నరేలా ప్రాంతంలోని చంచల్ పార్క్ వద్ద బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. రూట్ నంబర్ 961 (నాగ్లోయ్ నుండి నజాఫ్గఢ్ రహదారి) క్లస్టర్ బస్సులో బాంబు ఉన్నట్లు అనుమానం వచ్చింది.
Read Also:Delhi : ఢిల్లీలో దారుణం.. కోచింగ్ సెంటర్లోకి నీళ్లు వచ్చి ముగ్గురు విద్యార్థులు మృతి
మేము బాంబు లాంటిది చూశాము: బస్ కండక్టర్
ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేసిన బస్సు కండక్టర్ దివాన్ సింగ్, మేము నంగ్లోయ్ నుండి బయలుదేరామని చెప్పాడు. తిలాంగ్పూర్ కోట్లా వద్ద 10-12 మంది ప్రయాణికులు దిగారు. అప్పుడు మేము వారి సీట్ల క్రింద బాంబు లాంటిది చూశాము. మేము బస్సును ఆపి, మిగిలిన ప్రయాణికులను క్రిందికి దింపమని అడిగాము. అప్పుడు మేము 100 నంబర్కు డయల్ చేసాము. అనంతరం సమాచారం అందుకున్న పీసీఆర్ బాంబు నిర్వీర్య బృందానికి ఫోన్ చేశారు.
తాజావార్తలు
-
Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
-
RJ Balaji: థియేటర్లో త్రిషను హగ్ చేసుకుని ఏడ్చేసిన RJ బాలాజీ.. వీడియో వైరల్
-
Moto G37 Power, Moto G37: మోటో జి37 పవర్, మోటో జి37 రిలీజ్ డేట్ ఫిక్స్.. డైమెన్సిటీ 6400, 7,000mAh భారీ బ్యాటరీ
-
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
-
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..