Delhi: ఢిల్లీలోని నాంగ్లోయ్ నుండి శనివారం రాత్రి సెంట్రల్ పార్క్ నజాఫ్గఢ్ రోడ్లోని డిటిసి క్లస్టర్ బస్సులో బాంబు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతమంతా భయాందోళనలకు గురయింది. సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. బాంబు కాల్పై విచారణ జరిపిన తర్వాత, బస్సులో అనుమానాస్పద వస్తువు ఉందని రాత్రి 9.53 గంటలకు మాకు కాల్ వచ్చిందని డిసిపి ఔటర్ జిమ్మీ చిరం తెలిపారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ను పిలిపించి విచారణ చేపట్టినా అలాంటిదేమీ లభించలేదు. ఎన్ఎస్జీ బృందం కూడా ఘటనాస్థలికి చేరుకుంది.
Read Also:Jishnu Dev Varma: తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ..
అయితే వైర్ను పోలిన అనుమానాస్పద వస్తువును స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆ విషయం ఏంటనేది బీడీఎస్ బృందాలు ఆరా తీస్తున్నాయి. విచారణ అనంతరం బాంబులాంటి వస్తువులు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. నంగ్లోయ్ నుండి నజాఫ్గఢ్ రహదారిపై బకర్వాలా సిఎన్జి పంప్ సమీపంలోని నరేలా ప్రాంతంలోని చంచల్ పార్క్ వద్ద బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. రూట్ నంబర్ 961 (నాగ్లోయ్ నుండి నజాఫ్గఢ్ రహదారి) క్లస్టర్ బస్సులో బాంబు ఉన్నట్లు అనుమానం వచ్చింది.
Read Also:Delhi : ఢిల్లీలో దారుణం.. కోచింగ్ సెంటర్లోకి నీళ్లు వచ్చి ముగ్గురు విద్యార్థులు మృతి
మేము బాంబు లాంటిది చూశాము: బస్ కండక్టర్
ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేసిన బస్సు కండక్టర్ దివాన్ సింగ్, మేము నంగ్లోయ్ నుండి బయలుదేరామని చెప్పాడు. తిలాంగ్పూర్ కోట్లా వద్ద 10-12 మంది ప్రయాణికులు దిగారు. అప్పుడు మేము వారి సీట్ల క్రింద బాంబు లాంటిది చూశాము. మేము బస్సును ఆపి, మిగిలిన ప్రయాణికులను క్రిందికి దింపమని అడిగాము. అప్పుడు మేము 100 నంబర్కు డయల్ చేసాము. అనంతరం సమాచారం అందుకున్న పీసీఆర్ బాంబు నిర్వీర్య బృందానికి ఫోన్ చేశారు.