పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలకు ఇంధన సంక్షోభం తీసుకొచ్చింది. గత కొద్దిరోజులుగా మధ్యప్రాచ్యంలో జరుగుతున్న వార్ కారణంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో ఆయా దేశాల్లో ధరలు పెరిగిపోయాయి. దీంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.
ప్రస్తుతం శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన సంక్షోభం కారణంగా ప్రభుత్వం ధరలను పెంచేసింది. శనివారం అర్ధరాత్రి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచినట్లుగా శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ధరల పెంపు ఇలా:
ఆక్టేన్ 92 పెట్రోల్: లీటర్కు రూ.24 పెంచడంతో ధర రూ.317కి చేరింది.
ఆక్టేన్ 95 పెట్రోల్: లీటర్కు రూ.25 పెంచడంతో ధర రూ.365కి చేరింది.
ఆటో డీజిల్: లీటర్కు రూ.22 పెంచడంతో ధర రూ.303కి చేరింది.
సూపర్ డీజిల్: లీటర్కు రూ.24 పెంచడంతో ధర రూ.353కి చేరింది.
కిరోసిన్: లీటర్కు రూ.13 పెంచడంతో ధర రూ.195కి చేరింది.
అలాగే పాకిస్థాన్లో కూడా పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి. చమురు సంక్షోభం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం పెంచేసింది. లీటర్కు రూ.55 పెంచింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో అన్ని రకాల వాహనాలు, వ్యాపారాలు, ఇతర సామాన్యుల జీవితాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలంక, పాకిస్థాన్ దేశాలు ఇంధన ధరలు పెంచేశాయి. ఇలానే మరిన్ని దేశాలు కూడా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Trump: పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఇరాన్ కౌంటర్ ఎటాక్
