మూడు మ్యాచుల్లో మూడూ వివాదాలే.. SRHను వెంటాడుతున్న అంపైరింగ్ తప్పులు.. యాజమాన్యం సంచలన నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunrisers Hyderabad to Complain BCCI Over Avesh Khan Incident: సన్రైజర్స్ హైదరాబాద్(SRH) మూడో మ్యాచ్లో ఓటమి పాలైంది. సొంతగడ్డపై జరిగిన ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) చేతితో ఘోరంగా ఓడిపోయింది. అయితే.. ఈ సీజన్ ఎస్ఆర్హెచ్కు కలిసి రాలేనట్టుంది. వరుసగా వివాదాలు హైదరాబాద్ టీమ్ను చుట్టుముడుతున్నాయి. ఈ వివాదాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి ఫిర్యాదు చేయాలని సన్రైజర్స్ నిర్ణయించుకున్నట్లు క్రిక్బజ్ నివేదించింది. ముఖ్యంగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో చోటుచేసుకున్న ‘అవేష్ ఖాన్ ఘటన’ సన్రైజర్స్ యాజమాన్యానికి తీవ్ర అసంతృప్తిని కలిగించింది.
READ MORE: Cabinet Sub-Committee: రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో కీలక చర్చలు..
Also Read
- Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
- Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
- Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి 'రోమాన్స్ స్కామ్' కథ వింటే నోరెళ్లబెడతారు!
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్లో ఉత్కంఠ రేపిన విషయం తెలిసిందే. లక్నో గెలుపునకు రెండు బంతుల్లో ఒక పరుగు కావాల్సిన ఉండేది. ఈ సమయంలో కెప్టెన్ రిషబ్ పంత్ కొట్టిన బంతి బౌండరీ వైపు దూసుకెళ్లింది. ఆ సమయంలో బౌండరీ లైన్ అవతల డగౌట్ సమీపంలో ఉన్న లక్నో ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్, తన చేతిలో ఉన్న బ్యాట్తో ఆ బంతిని వెనక్కి కొట్టాడు. అయితే, అవేష్ బంతిని తాకే సమయానికి అది ఇంకా బౌండరీ లైన్ను దాటలేదని రిపీట్లలో స్పష్టమైంది. దీంతో నిబంధనల ప్రకారం తమకు ఐదు పెనాల్టీ పరుగులు కేటాయించాలని సన్రైజర్స్ వాదించింది. కానీ, అక్కడ ఫీల్డర్లు ఎవరూ లేరని, బంతి ఎలాగూ బౌండరీకి వెళ్లేదే కాబట్టి పెనాల్టీ ఇచ్చే అవకాశం లేదని అంపైర్లు స్పష్టం చేయడంతో వివాదం చెలరేగింది. కేవలం ఈ ఒక్క ఘటనే కాకుండా అంతకుముందు జరిగిన మ్యాచ్ల్లోని అంపైరింగ్ నిర్ణయాలపై కూడా సన్రైజర్స్ గుర్రుగా ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో హెన్రిచ్ క్లాసెన్ క్యాచ్ పట్టే సమయంలో ఫీల్డర్ ఫిల్ సాల్ట్ కాలు బౌండరీ కుషన్కు తగిలిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అలాగే కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ క్యాచ్ను వరుణ్ చక్రవర్తి సరిగ్గా అందుకున్నాడా లేదా అనే విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. ఆ సమయంలో అభిషేక్ తీవ్ర ఆగ్రహంతో మైదానాన్ని వీడటం చర్చనీయాంశమైంది. ఈ వరుస వివాదాల నేపథ్యంలో బీసీసీఐతో సంప్రదింపులు జరిపే పనిలో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఉంది.
తాజావార్తలు
-
Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
-
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..