TSRTC : వసంత పంచమి సందర్భంగా పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC : వసంత పంచమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ 108 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరకు 88 బస్సులు, సిద్దిపేట జిల్లాలోని వర్గల్కు 20 ప్రత్యేక బస్సులను నడపనుంది. బుధ, గురువారాల్లో ఈ బస్సులు తిరుగుతాయి. బాసరకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి 21, జేబీఎస్ నుంచి 12, నిజామాబాద్ నుంచి 45, హన్మకొండ నుంచి 5, కరీంనగర్ నుంచి 4, జగిత్యాల నుంచి ఒక బస్సును ఏర్పాటు చేసింది. వర్గల్కు సికింద్రాబాద్(గురుద్వారా) నుంచి ప్రతి అరగంటకో బస్సు నడిచే విధంగా టీఎస్ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ గురుద్వారా నుంచి 10, జేబీఎస్ నుంచి 6, గజ్వేల్ నుంచి 2, సిద్దిపేట నుంచి 2 బస్సులను నడుపుతున్నారు.
Read Also: INDvs NZ: రోహిత్, గిల్ దూకుడు..భారీ స్కోర్ దిశగా టీమిండియా
Also Read
ఈ ప్రత్యేక బస్సు సర్వీస్ లను ఉపయోగించుకుని భక్తులంతా క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 26న వసంత పంచమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బాసర, వర్గల్కు 108 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. భక్తుల రద్దీ మేరకు అదనపు సర్వీసులను సంస్థ పెంచుతుందని వారు స్పష్టం చేశారు.ఈ ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ముందస్తు రిజర్వేషన్కు తమ అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in ను సందర్శించాలని కోరారు.
Read Also: Pakistan: పాకిస్థాన్ క్రికెట్లో కీలక పరిణామం.. షాహిద్ అఫ్రిదిపై వేటు
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!