Site icon NTV Telugu

Tragedy : ఆస్తి పంపకాలు పంచాయతీ.. తండ్రిపై కొడుకు దాడి.. మృతి

Dead

Dead

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఆస్తి పంపకాలు చేసుకుందామని పంచాయతీ పెట్టించి, పంచాయతీలో ఇద్దరి మధ్య చిలికి చిలికి గాలివానై ఆగ్రహం పట్టలేని కొడుకులు కన్న తండ్రి పై, అతని రెండో భార్యపై కత్తులతో దాడి చేయగా ఒకరు మరణించగా, మరొకరు తీవ్ర గాయాలు అయిన సంఘటన జిల్లాలో జరిగింది. వేములవాడ పట్టణానికి చెందిన మల్లయ్యకు ఇద్దరు భార్యలు, మొదటి భార్య బాలవ్వ కు ఒక కొడుకు ముగ్గురు బిడ్డలు, రెండో భార్య పద్మకు కూడా ఒక్క కొడుకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు, మొదటి భార్య చనిపోవడంతో మల్లయ్య గత కొన్ని రోజులుగా రెండో భార్య పద్మతో ఉంటుండగా, పలుమార్లు మొదటి భార్య కొడుకు, కుటుంబ సభ్యులు కలిసి ఆస్తి పంపకాలు చేయాలని గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు పెద్ద మనుషుల మధ్య పంచాయతీ జరుగుతున్న క్రమంలో మల్లయ్య, అతని రెండో భార్య పద్మ పై బాలవ్వ కొడుకు రాజ్ కుమార్ అల్లుళ్లు బిడ్డలు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కత్తులతో దాడి చేయగా, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే.. మల్లయ్య మార్గమధ్యంలో మరణించగా, పద్మ పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనపై వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tata Nexon EV Fire Case: టాటా నెక్సాన్ EV కేసు.. రూ. 19.55 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం..

Exit mobile version