Madhya Pradesh: బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 12మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని హర్దా టౌన్ (Harda Town) లో ఘోర విషాదం చోటుచేసుకుంది. బాణాసంచా ఫ్యాక్టరీ (firecracker factory)లో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఇప్పటివరకు 12 మంది చనిపోయారు. మరో 60 మందికి పైగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. ఫైరింజన్లు, సహాయక బృందాలు హుటాహుటినా సంఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. మంటలు చుట్టుపక్కల ఉన్న భవనాలకు కూడా విస్తరించడంతో పలువురు పరుగులు తీయగా, మరికొందరు ఫ్యాక్టరీలో చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు.
అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. పరిస్థితిని సమీక్షించారు. హెలికాప్టర్ ద్వారా పరిస్థితిని అంచనా వేసి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని మంత్రులకు, అధికారులకు ఆదేశించారు. క్షతగాత్రుల తక్షణ చికిత్సకు భోపాల్, ఇండోర్లోని మెడికల్ కాలేజీలు, భోపాల్ ఏఐఐఎంఎస్ బర్న్ యూనిట్కు తరలించాలని అదేశాలిచ్చారు.
Also Read
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచిత చికిత్స అందించనున్నారు. హార్దా జిల్లా ఆస్పత్రిలో 65 మంది చికిత్స పొందుతున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మోడీ దిగ్భాంతి.. సహాయం..
హర్దా అగ్నిప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సహాయాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు.. క్షతగాత్రులకు రూ.50 వేల సహాయం ప్రకటించారు.
Harda firecracker factory fire | PM Narendra Modi announces Rs 2 lakhs from PMNRF to the next of kin of each deceased and Rs. 50,000 for the injured. pic.twitter.com/zInrsxrkEb
— ANI (@ANI) February 6, 2024
#WATCH | Aerial visuals of the firecracker factory in Harda, Madhya Pradesh where a massive explosion took place today.
Six people have died and 59 others are injured in the incident. pic.twitter.com/4s1tgz7kKY
— ANI (@ANI) February 6, 2024
- Tags
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!