AP Liquor Scam Case: సిట్ విచారణ.. సంచలన విషయాలు బయటపెట్టిన నారాయణస్వామి..!
- ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ దూకుడు..
- మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ప్రశ్నించిన సిట్..
- సిట్ విచారణలో సంచలనం విషయాలు బయటపెట్టిన నారాయణస్వామి..
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ కేసు సంచలనంగా మారింది.. విచారణలో మరింత దూకుడు పెంచింది సిట్.. ఇప్పటికే కీలక వ్యక్తులు అరెస్ట్ కాగా.. మరిన్ని అరెస్ట్లు తప్పవనే ప్రచారం జరుగుతోంది.. అయితే, ఈ రోజు లిక్కర్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిని ప్రశ్నించారు సిట్ అధికారులు.. అయితే, సిట్ విచారణలో సంచలన విషయాలు బయటపెట్టారట నారాయణస్వామి.. ఏపీ బేవరేజ్ సంబంధించిన అధికారులను నియమించడంలో నా పాత్ర ఏమీ లేదన్నారు.. నాకు లిక్కర్ కేసుకు సంబంధం లేదన్న ఆయన.. సిట్ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు.. నా మాట అక్కడ వినే వారు ఎవరంటూ చెప్పుకొచ్చారట నారాయణస్వామి.. నా మాటలను అక్కడ ఏ అధికారి వినలేదన్న ఆయన.. సిట్ అధికారులు సేకరించిన ఆధారాలను ముందుపెట్టి ప్రశ్నించడంతో నీళ్లు నమిలారట.. నారాయణస్వామి నుంచి మరిన్ని కీలకమైన విషయాలు రాబట్టిందట సిట్.. మరోసారి విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు.. ఇక, నారాయణస్వామి ఇంటిలో విచారణ ముగించుకొని సిట్ టీమ్ బయల్దేరివెళ్లిపోయింది..
Read Also: Bigg Boss Agnipariksha Promo : ముఖానికి పేడ రాసుకున్న కంటెస్టెంట్.. ఇవేం పనులురా బాబు..
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
మొత్తంగా లిక్కర్ స్కామ్ కేసులో తొలిసారి మాజీ డిప్యూటీ సీఎం నారాయణ సిట్ విచారణ ముగిసింది.. మరోసారి నారాయణ స్వామిని విచారించే అవకాశం ఉండగా.. దానికి సంబంధించిన సిట్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.. దాదాపు ఆరు గంటల పాటు నారాయణ స్వామిని ప్రశ్నించింది సిట్.. పలు డాక్యుమెంట్లు, సెల్ ఫోన్లు సీజ్ చేశారు.. సైబర్ నిపుణుల ద్వారా మెయిల్స్, మెసేజ్లను రిస్టోర్ చేశారు అధికారులు.. కేసిరెడ్డి సహా ఇతరుల ఇచ్చిన సమాచారంతో సేకరించిన ఆధారాలను నారాయణ స్వామి ముందు పెట్టి ప్రశ్నించింది సిట్… కాగా, వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖామంత్రిగా పని చేశారు నారాయణస్వామి.. వైసీపీ హయాంలో మద్యం పాలసీలో మార్పులు, మద్యం ఆర్డర్స్లో ఆన్ లైన్ విధానం తొలగించి మాన్యువల్ విధానం తీసుకురావడంపై విచారించిందట సిట్ బృందం.. డిజిటల్ చెల్లింపులు జరపకుండా మద్యం అమ్మకాల వెనుక ఎవరి ఒత్తిళ్లున్నాయనేదానిపై నారాయణస్వామిని ప్రశ్నించింది.. ఎక్సైజ్ పాలసీలో నాడు తీసుకున్న నిర్ణయాల వెనుక ఎవరి పాత్ర ఏంటినేది విచారించింది.. అయితే, సిట్ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వని నారాయణస్వామి.. పలు ప్రశ్నలకు మౌనమే సమాధానంగా ఉన్నారట.. మరి కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటవేశారట మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి..
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!