SIP : సిప్ అద్భుతం.. నెలవారీ రూ. 10,000పెట్టుబడితో రూ. 3.50 కోట్లు.. ఎలా అంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SIP : కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేయండి.. కోట్లలో రాబడిని పొందండి. చాలా మందికి సిస్టమాటిక్ ఇన్వెస్టిమెంట్ మీద అవగాహన లేకపోవడంతో సంపద కోల్పోతున్నారు. SIPలో పెట్టుబడి పెట్టడం గురించి ఎవరైనా మీకు చెబితే దానిలో కచ్చితంగా నిజమైన పాయింట్ ఉంటుంది. SIPలో పెట్టుబడి పెట్టడం అనేది స్టాక్ మార్కెట్ రిస్క్తో ముడిపడి ఉన్నప్పటికీ, SIPలో సంవత్సరానికి పెట్టుబడి పెట్టడం వలన మీరు దీర్ఘకాలికంగా.. భారీ రాబడిని పొందవచ్చు. మీరు వేలల్లో పెట్టుబడి పెడితే.. కోట్ల రూపాయలలో రాబడులు పొందుతారు.
ఉదాహరణకు.. మీరు SIPలో నెలకు రూ. 10,000 మాత్రమే పెట్టుబడి పెట్టినట్లయితే, మీరు చివరికి రూ. 3.50 కోట్ల వరకు నిధులను కూడగట్టవచ్చు. మీరు సిప్లో ఏది పెట్టుబడి పెట్టినా, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఆ డబ్బును స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి దానిపై వచ్చిన రాబడిని ప్రజలకు పంచుతాయి. SIPలో పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో మంచి రాబడి లభిస్తుంది.
Also Read
- Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
Read Also:Pakistan PM: పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్.. అధ్యక్షుడిగా ఆసిఫ్ జర్దారీ!
దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. కోటక్ మ్యూచువల్ ఫండ్ తన కోటక్ బ్లూచిప్ ఫండ్ను 1998 సంవత్సరంలో ప్రారంభించింది. ఇప్పుడు ఈ ఫండ్ 25 సంవత్సరాలుగా ఉంది. దీనిలో SIP చేస్తున్న వారికి సమ్మేళనం ప్రయోజనం లభించింది. ఈ ఫండ్ ప్రారంభమైనప్పటి నుండి సంవత్సర రాబడిపై 16.36శాతం వార్షిక వృద్ధి రేటును అందించింది. అంటే ఒక వ్యక్తి గత 25 ఏళ్లలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ప్రతి నెలా రూ.10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే, జనవరి 31, 2024 నాటికి అతని వద్ద మొత్తం రూ.3.50 కోట్ల ఫండ్ ఉంటుంది.
సిప్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ ఉన్నప్పటికీ.. పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. కోటక్ బ్లూచిప్ ఫండ్ ఉదాహరణను పరిశీలిస్తే, 2000 డాట్-కామ్ బబుల్ పేలడం, 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం, 2016 డీమోనిటైజేషన్, 2020లో కోవిడ్-19 మహమ్మారి వంటి కష్ట సమయాల్లో కూడా పెట్టుబడిదారులకు మంచి రాబడిని అందించింది. నిఫ్టీ 50 బెంచ్మార్క్ ఇండెక్స్ 15శాతం రాబడిని అందించగా, ఈ ఫండ్ 18శాతం మిశ్రమ రాబడిని ఇచ్చింది. జనవరి 31, 2024 నాటికి ఫండ్ నిర్వహణలో ఉన్న ఆస్తి (AUM) రూ.7424.61 కోట్లకు చేరుకుంది.
Read Also:AP Inter Hall Tickets: నేటి నుంచి ఇంటర్ హాల్టికెట్ల జారీ.. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు
తాజావార్తలు
-
CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
-
Naga Bandham: 110 కోట్ల రిస్క్.. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లోనే అసలు రహస్యం!
-
Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
-
Maa Inti Bangaram: 73 కోట్ల వసూళ్లతో అన్-స్టాపబుల్ ‘బంగారం’!
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!