సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో ఒక ఎకరంలో వరి వేసినా ఖబడ్దార్, ఆ పరిధిలో వ్యవసాయ అధికారిని సస్పెండ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు కలెక్టర్ వెంకట్రామి రెడ్డి. వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లేనని తేల్చి చెప్పారు. సోమవారం వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు పై కలెక్టరేట్ లో అధికారులతో కలెక్టర్ వెంకట్రామి రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… తమ నిర్ణయంపై జీఓలు ఏమి ఉండవని… ఇది తన హుకుమని చెప్పారు. తాను కలెక్టర్ గా ఉన్నన్ని రోజులు ఇది అమలు అవుతుందని స్పష్టం చేశారు కలెక్టర్ వెంకట్రామి. ఈ విషయంలో హై కోర్టు, సుప్రీం కోర్టు కి వెళ్లినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఒక్క కిలో వరి విత్తనాలు అమ్మినా… షాప్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు కలెక్టర్ వెంకట్రామి.
