Karnataka Politics: సీఎం ఇంట్లో ఎమోషనల్ సీన్.. సిద్ధరామయ్య కాళ్లకు మొక్కిన డీకే శివకుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka politics: కర్ణాటక రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఉదయం తన నివాసంలో ఏర్పాటు చేసిన హై-ప్రొఫైల్ ‘బ్రేక్ఫాస్ట్ మీటింగ్’ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. లీడర్షిప్ మార్పుపై జోరుగా ప్రచారం సాగుతున్న తరుణంలో, ఈ కీలక సమావేశంలో సిద్ధరామయ్య తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. సరిగ్గా పదవి నుంచి తప్పుకునే తరుణంలో.. ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ఒక ఆసక్తికరమైన, ఎమోషనల్ సీన్ కనిపించింది. తీవ్రమైన రాజకీయ ఉత్కంఠ నడుమ సీఎం నివాసానికి చేరుకున్న డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకున్నారు. ఇడ్లీ, వడ, చౌచౌ బాత్ వడ్డించిన ఈ వీడ్కోలు విందులో శివకుమార్ కాస్త భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలపై హోంమంత్రి జి. పరమేశ్వర స్పందిస్తూ.. సీఎం పదవికి రాజీనామా చేయడానికి ముందే సిద్ధరామయ్య ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. గత మూడేళ్లుగా తనకు, తన ప్రభుత్వానికి సహకరించిన మంత్రివర్గ సహచరులందరికీ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలపడానికే ఈ విందు ఇచ్చారని స్పష్టం చేశారు. మరోవైపు, కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ.. రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన రాజీనామా చేస్తే డి.కె. శివకుమార్కు సీఎం పగ్గాలు అప్పగించేలా లైన్ క్లియర్ కానుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా, అలాగే కె.సి. వేణుగోపాల్ బుధవారమే బెంగళూరు చేరుకున్నారు.
Also Read
- IPL 2027: గంగూలీ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ 2027లో ఆ జట్టుకు కోచ్గా యువరాజ్ సింగ్..
- Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
- Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
- AP Women's Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
అయితే, పార్టీ నష్టనివారణ చర్యల్లో భాగంగా సూర్జేవాలా మాత్రం లీడర్షిప్ మార్పు వార్తలను ఖండించారు. ఇప్పటివరకు కర్ణాటకలో ఎలాంటి శాసనసభా పక్ష (CLP) సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని, అధికారికంగా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. కాబట్టి మీడియా తొందరపడి ఎలాంటి తప్పుడు కథనాలు రాయొద్దని కోరారు. అయినప్పటికీ, బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత సిద్ధరామయ్య నేరుగా గవర్నర్ను కలిసి రాజీనామా లేఖ సమర్పించేందుకు సమయం కోరడంతో.. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి రాక ఖాయమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
-
IPL 2027: గంగూలీ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ 2027లో ఆ జట్టుకు కోచ్గా యువరాజ్ సింగ్..
-
Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
-
Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
-
AP Women’s Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?