Cherlopalli Incident: సభ్యసమాజం తలదించుకునే ఘటన.. 50 మంది కార్మికులపై యజమాని..!
- చెర్లోపల్లిలో సభ్యసమాజం తలదించుకునే ఘటన
- 50 మంది కార్మికులపై యజమాని కర్కశత్వం
- జీతాలు అడిగినందుకు చిత్రహింసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం చెర్లోపల్లిలో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. స్థానిక ‘SAB’ ఇటుక బట్టీలో పని చేస్తున్న ఒడిశాకు చెందిన కూలీలపై యజమాని పాశవికంగా దాడికి పాల్పడ్డాడు. కడుపు నిండా తిండి పెట్టకపోగా, చేసిన పనికి జీతాలు అడిగినందుకు వారిని చిత్రహింసలకు గురిచేశాడు. ఒడిశా నుంచి వలస వచ్చిన సుమారు 50 మంది కూలీలు గత కొంతకాలంగా ఈ బట్టీలో పనిచేస్తున్నారు. అడ్వాన్స్లు ఇచ్చామన్న సాకుతో యజమాని వారిని బానిసలకంటే హీనంగా చూస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేక 10 రోజుల క్రితం ఇంటర్నెట్ నేషనల్ జస్టీస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా కూలీలు ఒడిశా లేబర్ కమిషన్కు ఫిర్యాదు చేశారు.
ఈ విషయం తెలిసిన యజమాని ఆగ్రహంతో ఊగిపోయి, కూలీలపై మరోసారి దాడికి తెగబడ్డాడు. వారిని ఒక లారీలో బలవంతంగా నిర్బంధించి, శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ వద్ద వదిలిపెట్టి చేతులు దులుపుకున్నాడు. రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం బాధితుల ఫిర్యాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేరడంతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించారు. కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు అర్ధరాత్రి సమయంలో మెరుపు దాడి నిర్వహించి.. చెల్లాచెదురైన కూలీలను సురక్షితంగా రక్షించారు. బాధితులందరినీ వెంటనే తిరుపతి కలెక్టరేట్కు తరలించారు.
Also Read
ప్రస్తుతం ఆర్డీవో రామ్మోహన్ బాధితుల నుంచి స్టేట్మెంట్లను రికార్డ్ చేసుకున్నారు. అడ్వాన్స్లు ఇచ్చి తమను వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని, తిండి పెట్టకుండా కొడుతున్నారని కూలీలు అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడైన ఇటుక బట్టీ యజమానిపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. కటకటాల్లోకి పంపేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. జిల్లా యంత్రాంగం తీసుకున్న ఈ వేగవంతమైన చర్యతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
-
Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్పై రష్మిక కామెంట్స్ వైరల్!
-
Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!