Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్మీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ హై కమాండ్కు పంపారు. ఎమ్మెల్యేల తిరుగుబాటు, అసమ్మతి నేపథ్యంలో సీఎంను మార్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. ఇక, సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమై కొత్త సీఎంను ఎన్నుకునే అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి క్రాస్ ఓటు వేయడం హిమాచల్ ప్రదేశ్ పాలిటిక్స్ ను షేక్ చేసింది. కాంగ్రెస్ కు బిజెపి కంటే ఆరుగురు సభ్యుల బలం ఉన్నప్పటికీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయింది.. కాంగ్రెస్ పై ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేసి బిజెపికి అభ్యర్థికి ఓటు వేశారు. దీంతో ముఖ్యమంత్రి సుఖ్మీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.
Himachal Pradesh : హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా

New Project (37)