Shikhar Dhawan Divorce: టీమిండియా క్రికెటర్కు విడాకులు మంజూరు.. భార్య వల్ల మానసిక వేదన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shikhar Dhawan divorce with Wife Aesha Mukerji: భారత సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్కు విడాకులు మంజూరు అయ్యాయి. ధావన్, అతడి మాజీ భార్య ఆయేషా ముఖర్జీకి ఢిల్లీ కోర్టు బుధవారం విడాకులు మంజూరు చేసింది. ఆయేషా కారణంగా గబ్బర్ మానసిక వేదనకు గురయ్యాడని పేర్కొంటూ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కాంప్లెక్స్లోని ఫ్యామిలీ కోర్టు విడాకులను ఆమోదించింది. ఇక తన కుమారుడిని కలవడానికి ధావన్కు కోర్టు అనుమతి ఇచ్చింది.
గత కొంత కాలంగా ఆయేషా ముఖర్జీకి శిఖర్ ధావన్ దూరంగా ఉంటున్నాడు. 2021లో విడాకుల గురించి ఆయేషా సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొంది. ఈ క్రమంలో ఆయేషా తనను మానసికంగా హింసిస్తోందని ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో గబ్బర్ విడాకుల పిటిషన్ ధాఖలు చేశాడు. ఈ కేసు తాజాగా కోర్టులో విచారణకు వచ్చింది. తన భార్యపై ధావన్ చేసిన ఆరోపణలు వాస్తవమైనవని న్యాయమూర్తి హరీష్ కుమార్ అంగీకరించారు. కుమారుడితో విడిగా ఉండాలని ఆయేషా ఒత్తిడి చేయడంతో.. ధావన్ మానసిక వేదనకు గురయ్యాడని న్యాయమూర్తి పేర్కొన్నారు.
Also Read
- Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
ఆస్ట్రేలియాలో తన సొంత డబ్బుతో కొనుగోలు చేసిన మూడు ఆస్తులలో 99 శాతం తనని యజమానిగా చేయాలని ఆయేషా ముఖర్జీ తనను ఒత్తిడి చేసిందన్న శిఖర్ ధావన్ ఆరోపణను కూడా ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు పరిగణలోకి తీసుకుంది. అయితే ధావన్-ఆయేషాల కుమారుడి శాశ్వత కస్టడీపై కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ధావన్కు భారత్ లేదా ఆస్ట్రేలియాలో తన కుమారుడిని కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. వీడియో కాల్ ద్వారా కూడా తన కుమారుడితో మాట్లాడవచచ్చని తెలిపింది.
Also Read: Rohit Sharma: రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బిత్తరపోయిన రోహిత్.. అర్ధం కాలేదంటూ ముఖం తేలేసిన బట్లర్!
శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీలు 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కామన్ ఫ్రెండ్ ద్వారా పేస్ బుక్లో పరిచయం అయిన ఆయేషాకు థానే ముందుగా ప్రపోస్ చేశానని ధావన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ధావన్, ఆయేషాలకు జొరావర్ అనే 9 ఏళ్ల కొడుకు ఉన్నాడు. లాక్ డౌన్ ఆరంభంలో ముగ్గురు కలిసి వీడియోస్ కూడా చేశారు. అయితే 2021లో ధావన్తో విడాకులు తీసుకుంటున్నాని ఆయేషా స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. శిఖర్తో పరిచయం కాకముందే.. ఆయేషాకు పెళ్లయింది. అప్పటికే ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
తాజావార్తలు
-
Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
-
India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
-
Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!
-
Jani Master: శేఖర్ మాస్టర్తో గొడవ? మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ.. అసలు నిజం బయటపెట్టిన జానీ మాస్టర్!
-
Raaka : డ్యూయల్ కాదు ట్రిపుల్ కాదు.. అంతకుమించి రాకా!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!