టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నారు. ‘నారి నారి నడుమ మురారి’ వంటి సక్సెస్ తర్వాత, ఆయన తన తదుపరి చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీను వైట్లతో ప్రకటించారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీసుకురాబోతున్నారు. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న శ్రీను వైట్ల, ఈసారి శర్వానంద్ కోసం ఒక అదిరిపోయే స్క్రిప్ట్ను సిద్ధం చేశారట.
Also Read : Karuppu : సూర్య ‘కరుప్పు’ సినిమా రిలీజ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు ఆర్జే బాలాజీ
ముఖ్యంగా శ్రీను వైట్ల సినిమాల్లో ఉండే విభిన్నమైన కామెడీ పాత్రలు, ప్రాసలతో కూడిన డైలాగులు ఈ సినిమాలో హైలైట్గా నిలవనున్నాయి. స్క్రిప్ట్ వర్క్ చాలా బాగా కుదిరిందని, శర్వానంద్ బాడీ లాంగ్వేజ్కు సరిపోయేలా వినోదాత్మకమైన పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్ నెల నుండి ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. టెక్నీషియన్లు మరియు ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. శర్వానంద్కు సంక్రాంతి సీజన్ బాగా కలిసి వస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని కూడా 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో శర్వానంద్ తన కామెడీ టైమింగ్తో బాక్సాఫీస్ వద్ద మరో హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.
