Stock Market : సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన స్టాక్ మార్కెట్.. 24వేలు దాటిన నిఫ్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market : భారత స్టాక్ మార్కెట్లో పెరుగుదల గురువారం కూడా కొనసాగింది. స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న బూమ్ కారణంగా సెన్సెక్స్, నిఫ్టీలు నిరంతరం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. గురువారం కూడా సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డు స్థాయికి చేరి సరికొత్త రికార్డు సృష్టించాయి. సెన్సెక్స్ 79 వేల స్థాయిని దాటగా, నిఫ్టీ కూడా రికార్డు గరిష్ట స్థాయి 24 వేలు దాటింది. అయితే, ట్రేడింగ్ సెషన్లో రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్న తరువాత, రెండు ఇండెక్స్లు జారిపోయాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 269.62 పాయింట్ల లాభంతో 78943.87 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 76 పాయింట్ల లాభంతో 23945 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్ అన్ని రికార్డులను బద్దలు కొట్టింది
బిఎస్ఇ సెన్సెక్స్ కూడా ఈరోజు 78,771.64 వద్ద సరికొత్త రికార్డును నమోదు చేసింది. నిన్న అత్యధిక స్థాయి 78,759.40ని సాధించింది. మంగళవారం సెన్సెక్స్ 78 వేల స్థాయిని దాటింది. అంటే కేవలం 3 రోజుల్లోనే సెన్సెక్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఉదయం నుంచి మార్కెట్ పరిమిత స్థాయిలోనే ట్రేడవుతోంది. సెన్సెక్స్ షేర్లను పరిశీలిస్తే.. దాని 30 షేర్లలో, 12 పెరుగుదలతో ,18 షేర్లు క్షీణతతో ట్రేడవుతున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్ దాని పెద్ద సిమెంట్ డీల్ ఆధారంగా మార్కెట్లో టాప్ గెయినర్గా మారింది . JSW స్టీల్ తర్వాతి స్థానంలో ఉంది.
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
Read Also:Kalki 2898 AD : ప్రభాస్ ఫ్యాన్ గా మారిన అకిరా నందన్.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిమరీ!
బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్
మార్కెట్ ప్రారంభ సమయానికి, బిఎస్ఇలో లిస్టయిన స్టాక్ల మార్కెట్ క్యాప్ రూ. 437.02 లక్షల కోట్లు కాగా, ప్రారంభమైన అరగంటలో రూ. 438.46 లక్షల కోట్లకు తగ్గింది. మార్కెట్ ప్రారంభమైన ఒక గంట తర్వాత అంటే ఉదయం 10.12 గంటలకు, బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.439.07 లక్షల కోట్లుకు చేరుకుంది. బీఎస్ఈలో ట్రేడైన 3296 షేర్లలో 2060 షేర్లు లాభపడుతున్నాయి. 1122 షేర్లలో క్షీణత ఉంది. 114 షేర్లు ఎటువంటి మార్పు లేకుండా ట్రేడవుతున్నాయి.
ఈ స్టాక్స్ లాభనష్టాలను చవిచూశాయి
అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియాకు చెందిన కోస్పి, జపాన్కు చెందిన నిక్కీ, హాంకాంగ్కు చెందిన హ్యాంగ్సెంగ్, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Read Also:SA vs AFG: పరిస్థితులు అనుకూలించలేదు.. ఓటమిని అంగీకరిస్తున్నాం: రషీద్ ఖాన్
తాజావార్తలు
-
Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
-
Women’s Asia Cup 2026: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్.. మహిళల ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!