Maharashtra Elections: పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా.. అసెంబ్లీలో పత్తాలేరు?.. ఆయన వల్లే కొంపమునిగిందా?
- మహారాష్ట్ర దూసుకుపోతున్న మహాయుతి కూటమి
- గత పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన శరద్ పవార్ ఎన్సీపీఎస్పీ
- అసెంబ్లీ ఎన్నికల్లో పత్తాలేని పార్టీ
- ఆయన వ్యాఖ్యలే కారణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సాగుతున్నాయి. అదే సమయంలో.. మహా వికాస్ అఘాడీ (MVA) మరోసారి నిరాశను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. ఈ పోకడల మధ్య, భారతీయ రాజకీయ ప్రముఖుడు, ఎన్సీపీ(SP) అధినేత శరద్ పవార్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పార్టీ పనితీరు వారసత్వంపై పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.
గత పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన పార్టీలు..
గత పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన పార్టీలు.. ఇప్పుడు మాత్రం వెనుకపడ్డాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 13,ఉద్ధవ్ థాకరే(SHSUBT)పార్టీ 9, శరద్ పవార్ (NCPSP) పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే ఇప్పుడు మాత్రం ఆ మూడు పార్టీలు వెనుకంజలో ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు వచ్చిన నివేదిక ప్రకారం.. 87 స్థానాల్లో పోటీ చేసిన శరద్ పవార్ వర్గం ఎన్సీపీ 13 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇది శరద్ పవార్ రాజకీయ చరిత్రలో ఎన్నడూ జరగలేదట. ఇప్పటి వరకు శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీకి 11.58% ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 10.58% ఓట్లు రాగా, ఉద్ధవ్ ఠాక్రేకి చెందిన శివసేనకు 10.67% ఓట్లు వచ్చాయి. ఈ మూడు పార్టీలకు కలిపి 32.83% ఓట్లు రాగా.. బీజేపీ, అజిత్ పవార్కి చెందిన ఎన్సీపీ, ఏక్నాథ్ షిండే శివసేన కూటమికి 48.73% ఓట్లు వచ్చాయి.
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ఆయనే నిండా ముంచేశారా?
తన రాజ్యసభ పదవీకాలం 2026లో ముగియడంతో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలని యోచిస్తున్నట్లు శరద్ పవార్ ఇటీవల తన ప్రసంగంలో తెలిపారు. ఈ ప్రభావం ఎలెక్షన్స్లో గట్టిగా పడినట్టు తెలుస్తోంది. ఆయన ఎన్నికలకు దూరంగా ఉండటం ఎన్సీపీతో పాటు, కాంగ్రెస్ , ఉద్ధవ్ థాకరే పార్టీలను నిండా ముంచినట్టు అయింది. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి కట్టుగా ఉన్నంతగా, అసెంబ్లీ ఎన్నికల్లో లేవని స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం మహారాష్ట్రలో పెద్దగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. శరద్ పవార్ చేసిన వ్యాఖ్యల వల్లే ఆ పార్టీకి పడాల్సిన ఓట్లు బీజేపీ కూటమికి పడ్డాయని నిపుణులు తేల్చేశారు. కాగా.. నిర్ణయం ఆయన పార్టీకి పెను సవాలుగా మారనుంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఇదే ఆయనకు చివరి ఎన్నికలు అయితే, ఈ ఎన్నికల ఫలితం ఆయన కెరీర్కు మరకగా మారనుంది. ఇది శరద్ పవార్ను ఎప్పుడూ పీడకలలా వెంటాడుతుంది.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!