Supreme Court: ఆ ఎమ్మెల్యే ప్రొఫైల్తో యువతులకు ఎర.. షాదీ డాట్ కామ్పై సుప్రీంకోర్టు ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: షాదీ డాట్ కామ్కు సంబంధించిన అనేక మోసాలు తరచూ వెలుగు చూస్తుంటాయి. తాజాగా ఓ ఎమ్మెల్యే పేరుతో జరిగిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “షాదీ డాట్ కామ్”తో సైబర్ నేరాలకు మార్గం సులువుగా మారిందని కోర్టు పేర్కొంది. అసలు ఏం జరిగిందంటే..
READ MORE: Dhurandhar OTT Responce : నెట్ ఫ్లిక్స్ లో రికార్డులు బద్దలు కొడుతున్న ధురంధర్
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన చెరుకూరి హర్ష అలియాస్ జోగడ వంశీకృష్ణ అనే వ్యక్తి షాదీ డాట్ కామ్ వెబ్సైట్లో యానాం ఎమ్మెల్యే ఫొటోతో ప్రొఫైల్ సృష్టించి, పెళ్లి కాని యువతులను మోసం చేశాడు. ఆ ప్రొఫైల్ జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన ఒక వైద్యురాలు చూసి కాంటాక్ట్ చేసింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఐటీ శాఖ తన బ్యాంకు ఖాతాలను జప్తు చేసిందని చెప్పి రూ.11 లక్షలు దోచేశాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగగా, ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇదే తరహాలో ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో తమను మోసం చేసినట్లు నిందితుడి మీద పలువురు యువతులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో నిందితుడితో పాటు, షాదీ డాట్ కామ్ డైరెక్టర్ అనుపమ్ మిట్టల్, టీమ్ లీడర్ విఘ్నేష్, మేనేజర్ సతీష్ల మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమ మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని నిందితులు దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. దీంతో వీళ్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారిస్తూ షాదీ డాట్ కామ్ సైబర్ నేరగాళ్లకు మార్గాన్ని సులువుగా చేసిందని, అందుకే మీ మీద కేసు నమోదు చేశారని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఫైర్ అయ్యారు. ఈ కేసు గురించి తెలంగాణ హైకోర్టు పునఃసమీక్షించుకుని, స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ విచారణను ముగించారు.
READ MORE: MS Dhoni: 2027 వన్డే ప్రపంచకప్లో రోహిత్, కోహ్లీ ఆడతారా?.. MS ధోనీ సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..