దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలతో రోజుకోలాగా పరిస్థితులు మారుతున్నాయి. తాజాగా హార్ముజ్ జలసంధిపై ట్రంప్ డెడ్లాక్ విధించారు. బాంబ్ దాడుల కంటే తీవ్రంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. అణు ఒప్పందం చేసుకుంటునే హార్ముజ్పై దిగ్బంధం ఎత్తేస్తామని తేల్చి చెప్పారు. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. చమురు ధరలు మరోసారి భారీగా పెరిగిపోతాయని భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 888 పాయింట్లు నష్టపోయి 76,607 దగ్గర కొనసాగుతుండా.. నిఫ్టీ 268 పాయింట్లు నష్టపోయి 23, 909 దగ్గర కొనసాగుతోంది. పెట్టుబడిదారుల లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.
నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, ఎటర్నల్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన షేర్లు నష్టపోగా.. బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, బజాజ్ ఫిన్సర్వ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాభపడ్డాయి. ప్రస్తుతం అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక రూపాయి మరోసారి పతనమైంది. రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే రూ. 95 దగ్గర కొనసాగుతోంది. ఇక క్రూడాయిల్ ధర 113 డాలర్లకు చేరింది.
ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన దాడులు చేసింది. దీంతో అప్పటి నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి భారతీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.
