NTV Telugu Site icon

HanuMan Movie Team :హనుమాన్ టీం సంచలన ప్రకటన.. తెగే ప్రతి టికెట్లో 5 రూపాయలు రాముడికే..

Whatsapp Image 2024 01 07 At 11.04.38 Pm

Whatsapp Image 2024 01 07 At 11.04.38 Pm

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలుగులో ‘హనుమాన్’ తొలి సూపర్ హీరో కథని తెరక్కించారు. ‘హనుమాన్’ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా మరో ఐదు రోజుల్లో జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.సంక్రాంతి సందర్భంగా గుంటూరు కారం (జనవరి 12), సైంధవ్ (జనవరి 13), నా సామిరంగా (జనవరి 14) చిత్రాలు పోటీలో ఉన్నా.. హనుమాన్ మూవీ కథ మీద నమ్మకంతో వచ్చేస్తోంది. హనుమాన్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (జనవరి 7) హైదరాబాద్‍లో గ్రాండ్‍గా జరిగింది. ఈ ఈవెంట్‍కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.సంక్రాంతికి పోటీ చాలా తీవ్రంగా ఉండటంతో హనుమాన్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ థియేటర్లే దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి థియేటర్ల కేటాయింపు సమస్య గురించి చిరంజీవి ప్రస్తావించారు. అలాగే హనుమాన్ టీమ్‍లో ధైర్యం నింపేలా మాట్లాడారు.

మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు చిత్రాన్ని ఎప్పుడైనా తప్పకుండా చూస్తారని, ఈ విషయంలో ఎలాంటి డౌట్లు వద్దని మెగాస్టార్ తెలిపారు.. హనుమాన్ విజయం సాధిస్తుందని తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన అన్నారు.ఎన్ని సినిమాలు వచ్చినా సరే మన సినిమా కంటెంట్‍లో సత్తా ఉండి మనకు దైవాశీస్సులు ఉన్నాయంటే కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు అక్కున చేర్చుకుంటారు.. పెద్ద విజయాన్ని మీకు అందేలా చేస్తారు. అందుకే ఎలాంటి డౌట్ పెట్టుకోవద్దు అని చిరంజీవి తెలిపారు.. అలాగే జనవరి 22వ తేదీన జరిగే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిందని కుటుంబంతో తాము వెళ్లనున్నట్టు చిరంజీవి తెలిపారు. అలాగే అదే వేదిక పై చిత్ర యూనిట్ తరపున మెగాస్టార్ కీలక ప్రకటన చేసారు.హనుమాన్ సినిమా ఆడినన్ని రోజులు వచ్చే కలెక్షన్లలో ప్రతీ టికెట్‍పై 5 రూపాయలు అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇవ్వడానికి హనుమాన్ టీమ్ నిర్ణయించుకుందని చిరంజీవి ప్రకటించారు. ఈ కీలక నిర్ణయానికి హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డిని మెగాస్టార్ అభినందించారు. రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అని ఆయన అన్నారు.