ఓ పక్క వేసవి కాలం వేడి పుట్టిస్తోంది మారో పక్క స్కూల్స్ ఫీజుల పెంపుతో తల్లితండ్రులకు చమటలు పడుతున్నయి ప్రైవేట్ స్కూల్స్ ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు పెంచేందుకు సిద్ధమయ్యాయి.కూకట్ పల్లి లోని ఓ ప్రయివెట్ స్కూల్ ముందు తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేసారు.ఇక పిల్లలను కార్పొరేట్ లో చదివించాలన్న తల్లిదండ్రుల ఆశ నిరాశే మిగులుతుంది అని మీడియాతో అవేదన వెళ్ళబుచ్చుకొన్నరు.. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను ఇప్పడికే తోచిన రీతిలో పెంచాయి. కొత్తగా ప్రవేశాలు తీసుకునే విద్యార్థులు స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందే టర్మ్ ఫీ చెల్లించాలని ప్రైవేట్ స్కూళ్లు ఆదేశాలు జారీ చేశాయి. లేదుఅంటే బుక్స్ ఇవ్వడం కుదరదని మొఖం చాటేస్తున్నయు.కూకట్ పల్లిలో ఓ ప్రయవేటు స్కూల్ పది శాతం పెంచుతామని 30 నుండి 40 శాతం పెంచారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేద వ్యక్తం చేశారు. ఇలా పెంచుకుంటూ పోతే తాము కూడా స్కూల్ వద్దే పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు ప్రభుత్వం చోరోవ తీసుకొని ఈ యాజమాన్యాలపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
