SAPTA JYOTIRLINGA DARSHAN YATRA: తాజగా ఐఆర్సిటిసి భక్తులకోసం వారి భారత్ గౌరవ్ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర పేరుతో ఆగష్టు 17 – ఆగష్టు 28, 2024 న 11 రాత్రులు / 12 రోజులు జరగనుంది. ఈ టూర్ లో సందర్శన క్షేత్రాల విషయానికి వస్తే.. ఉజ్జయిని [మహకళేశ్వర్, ఓంకారేశ్వర్], ద్వారక [నాగేశ్వర్], సోమనాథ్ [సోమనాథ్], పూణే [భీమశంకర్], నాసిక్ [త్రయంబకేశ్వర్], ఔరంగాబాద్ [గ్రీశ్నేశ్వర్] లలో దర్శనాలను చేయించనున్నారు. ఇక ఈ ప్యాకేజీ ఆగష్టు 17వ తేదీన విజయవాడ నుంచి బయలుదేరును. మధిర, ఖమ్మం, డోర్నకల్, మహుబ్బాద్, వరంగల్, కాజీపేట, జనగాం, భవనగిరి, సికింద్రబాద్, కామారెడ్డి, నిజాంబాద్, ధర్మబడ్, మద్ఖేడ్, నాందేడ్, పూర్ణ మీదుగా భక్తులను ఎక్కించుకుంటారు.
South Central Railway: సికింద్రాబాద్ నుంచి తక్కువ టైమ్ లో గుంటూరు, విజయవాడకు వెళ్లొచ్చు..
ఈ టూర్ లో ఉదయం పూట కాఫీ/టీ/అల్పాహారం, మధ్యాహ్నం సమయంలో రుచికరమైన తెలుగు భోజనం, సాయంత్రం పూట స్నాక్స్/టీ/కాఫీ, రాత్రి సమయంలో అల్పాహారం ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా తెలుగు వంటవారిచే రైలులో ఏర్పాటు చేయబడిన కిచెన్లో ఆహార పదార్ధములు చేస్తారు. ఇక బస విషయానికి వస్తే.. క్షేత్రాల సందర్శన సమయాల్లో ప్రత్యేక బస ఏర్పాటు చేస్తారు. స్లీపర్ క్లాస్ వారికి నాన్ ఏసీ రూమ్లు., ఏసీ క్లాసుల వారికి ఏసీ రూమ్లు, ఇద్దరికి కలిపి లేదా ముగురికి కలిపి ఒక గదిని ఇస్తారు.
CAT 2024: మొదలు కానున్న రిజిస్ట్రేషన్.. పూర్తి వివరాలు ఇలా..
ఇక భద్రత విషయానికి వస్తే.. రైలులో ప్రతీ భోగీలో రైల్వేస్ తరపున ఎస్కార్ట్స్., ఆయా క్షేత్రాల్లో భక్తులను దగ్గరుండి తీసుకువెళ్లడం, తిరిగి రైలుకు చేర్చడం.. సమయానికి ఆహారం, మంచినీరు, టాయిలెట్ల పరిశుభ్రత.. రైలులో సీసీ కెమెరాలు, మైక్ ఏర్పాటు., లగేజీ భద్రత., ప్రయాణ ఇన్స్యూరెన్స్ సౌకర్యాలు ఉంటాయి. ఇక టిక్కిట్ ధరలు (ఒక్కరికి) చూస్తే.. 2nd ఏసీ రూ. 43,355/-, 3rd ఏసీ రూ. 33,015/-, స్లీపర్ రూ. 20,590/- గా ఉంది. ఇక పూర్తి వివరాలు, టికెట్ బుకింగ్స్ కోసం వెబ్సైట్ ను https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG28 సంప్రదించండి. ఇంకా పూర్తి వివరాలకోసం, బుకింగ్స్ కోసం 9281495843, 9281495845 నంబర్స్ ను సంప్రదించండి.