ప్రస్తుతం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు మారుమ్రోగిపోతుంది. బాలీవుడ్ మీడియాలో సందీప్ రెడ్డి వంగా హాట్ టాపిక్ గా మారాడు.అందుకు కారణం ఆయన తెరకెక్కించిన యానిమల్ మూవీనే. గతేడాది డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.యానిమల్ సినిమాలోని బీజీఎమ్, సీన్స్ మరియు స్క్రీన్ ప్లే అదిరిపోయాయి. అలాగే సందీప్ రెడ్డి టేకింగ్కు ప్రేక్షకులు ఎంతాగానో ఫిదా అయ్యారు. దాంతో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన యానిమల్ మూవీ లాంగ్ రన్లో రూ. 900 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. ఇక ఇటీవల ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో యానిమల్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది చూసిన ఇతర సినీ ఇండస్ట్రీ ప్రముఖులు మూవీపై, సందీప్ రెడ్డి వంగాపై విమర్శలు చేయడం మెదలు పెట్టారు.
యానిమల్ మూవీ లో బోల్డ్ కంటెంట్, స్త్రీల పట్ల ద్వేషం ప్రోత్సహించేలా ఉన్నాయంటూ, ప్రేక్షకులపై చెడు ప్రభావం చూపిస్తోందని కామెంట్స్ చేశారు.అలా కామెంట్స్ చేసిన వారి అందరికి సందీప్ రెడ్డి వంగా గట్టిగానే సమాధానం ఇచ్చాడు.”సినిమా చూసిన ప్రేక్షకులు అని ఉంటే నేను పెద్దగా పట్టించుకునేవాన్ని కాదు. కానీ, ఇండస్ట్రీలో ఉండి అన్ని తెలిసిన పాపులర్ యాక్టర్స్ అలా అనడం చాలా బాధగా ఉంది. ఎవరైనా సరే ఇతరులను అనే ముందు వారు గతంలో ఏం చేశారో చూసుకుని అనాలి” అంటూ సందీప్ రెడ్డి వంగా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చాడు. ఈ క్రిటిక్స్ వర్సెస్ సందీప్ రెడ్డి వంగా వార్ కొనసాగుతున్న నేపథ్యంలో సందీప్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు.”ఒకవేళ వాళ్లు నన్ను ఇండియాలో ఆపితే నేను హాలీవుడ్కు వెళ్లిపోతా. నాకు భాషా పరిమితులు అంటూ ఏం లేవు. నేను భోజ్పురి, కన్నడ, మలయాళం, పంజాబీతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తాను” అని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చాడు దీనితో ఏది ఏమైనా యానిమల్ మూవీకి సీక్వెల్ యానిమల్ పార్క్ను తెరకెక్కించేందుకు సందీప్ సిద్ధం అయ్యాడని తెలుస్తోంది.