Salman Khan: సల్మాన్ ఖాన్ మూవీకి అరుదైన గౌరవం.. ఏకైక ఇండియన్ సినిమా!
- సల్మాన్ ఖాన్ మూవీకి అరుదైన గౌరవం
- ఇంటర్నేషనల్ స్పై మ్యూజియంలో ఏక్ థా టైగర్ పోస్టర్
- భారతీయ సినిమాకు గర్వకారణం
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మూవీకి అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ స్పై మ్యూజియం (వాషింగ్టన్ డీసీ)లో బెస్ట్ మూవీగా ‘ఏక్ థా టైగర్’ మూవీ పోస్టర్ ప్రదర్శించబడింది. భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి ఈ గౌరవం దక్కించుకున్న ఏకైక సినిమా ఏక్ థా టైగర్. థియేటర్లలో విడుదలైన పదమూడు సంవత్సరాల తర్వాత ఈ ప్రత్యేకమైన అంతర్జాతీయ గౌరవాన్ని ఈ సినిమా దక్కించుకుంది. ఇది భారతీయ సినిమాకు గర్వకారణం అని చెప్పొచ్చు.
అరుదైన గౌరవంతో జేమ్స్ బాండ్, మిషన్: ఇంపాజిబుల్, మెన్ ఇన్ బ్లాక్ వంటి ఐకానిక్ గ్లోబల్ స్పై ఫ్రాంచైజీల సరసన ఏక్ థా టైగర్ నిలిచింది. ఇంటర్నేషనల్ స్పై మ్యూజియంలో ఐకానిక్ స్పై సినిమాలు, టెలివిజన్ సిరీస్లకు ఒక ప్రత్యేక విభాగం ఉంటుంది. ఇందులో దాదాపు 25 ప్రసిద్ధ అంతర్జాతీయ టైటిల్స్ పోస్టర్లు ప్రదర్శించబడతాయి. క్యాసినో రాయల్, మిషన్: ఇంపాజిబుల్, స్పై గేమ్, టింకర్ టైలర్ సోల్జర్ స్పై, సెవెన్టీన్ మూమెంట్స్ ఆఫ్ స్ప్రింగ్, OSS 117, G మెన్, ది ఇమిటేషన్ గేమ్, మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్, బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్, హోమ్ల్యాండ్, అలియాస్, ఫౌడా, ది ప్రిజనర్, గెట్ స్మార్ట్, మెన్ ఇన్ బ్లాక్, ది సీజ్, టర్న్: వాషింగ్టన్స్ స్పైస్, ది మ్యాన్ ఫ్రమ్ అంకుల్ వంటి సినిమాలు, షోలతో ఏక్ థా టైగర్ పోస్టర్ను ప్రదర్శించారు.
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
Also Read: iPhone Sales: ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ కాదు.. ఐఫోన్ కొనుగోలుదారులు ఎక్కువగా ఎక్కడున్నారో తెలుసా?
అరుదైన గౌరవంపై దర్శకుడు కబీర్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. సినిమా విజయాన్ని బాక్సాఫీసు కలెక్షన్లు మాత్రమే నిర్ణయించలేవని, ప్రేక్షకులకు ఎంత కాలం గుర్తున్నదనేది కూడా ముఖ్యం అని పేర్కొన్నారు. ఇప్పటికీ ఈ చిత్రం గురించి మాట్లాడుతుండటం ఆనందంగా ఉందన్నారు. యశ్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో రూపొందిన తొలి చిత్రం ఏక్ థా టైగర్. 2012 ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమాలో రా ఏజెంట్గా సల్మాన్ ఖాన్, ఐఎస్ఐ. ఏజెంట్గా కత్రినా కైఫ్ నటించారు. రూ.75 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా.. రూ.330 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?