Kalki2898AD : ప్రభాస్ ‘కల్కి – 2’ లో సాయి పల్లవి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం కల్కి. ఈ సినిమా మొదటి భాగంలో సుమతి (సమ్-80) పాత్రను బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనే పోషించిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. అయితే ఇప్పుడు కల్కి సినిమాకు సీక్వెల్ గా కల్కి 2 తెరకెక్కించబోతున్నాడు నాగి. అయితే సీక్వెల్ షూటింగ్లో కొన్ని కాల్షీట్ల సమస్యతో పాటు కొన్ని ఇతర కారణాల వల్ల ఈ సీక్వెల్ నుండి దీపిక తప్పుకుంది. .
Also Read : Tollywood : ఒక్కో సినిమాకు రూ. 80 కోట్లు అడుగుతున్న స్టార్ హీరో
Also Read
దాంతో ఇప్పుడు దీపికా పాత్రకు ఎవరిని తీసుకోవాలనే సందిగ్ధం నెలకొంది. ఇటీవల బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ అలాగే హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పేర్లు వినిపించాయి కానీ కన్ఫర్మ్ కాలేదు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఆ అదృష్టం సాయి పల్లవిని వరించింది. ప్రభాస్ సరసన సాయి పల్లవి ఫిక్స్ అయింది. ఇక సాయి పల్లవి నటన ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుమతి పాత్రలో ఉండే భావోద్వేగాలను, ఆ ఇంటెన్సిటీని పండించడంలో సాయి పల్లవి పర్ఫెక్ట్ ఛాయిస్ అని చిత్ర యూనిట్ భావిస్తోందట. ప్రభాస్ (భైరవ) పాత్రకు, సాయి పల్లవి పోషించబోయే సుమతి పాత్రకు మధ్య వచ్చే సన్నివేశాలు పార్ట్-2లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వైజయంతీ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సీక్వెల్పై భారీ అంచనాలు ఉన్నాయి. దీపికా పదుకొనే వంటి గ్లోబల్ స్టార్ స్థానంలో సాయి పల్లవి రావడం అనేది ఇండస్ట్రీ సర్కిల్స్ తో పాటు ట్రేడ్ వర్గాలలోనూ ఒక పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూట్ త్వరలోనే సార్ట్ కానుంది.
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Narendra Modi : సీఎం రేవంత్కు మోడీ కౌంటర్..
-
Mamata Banerjee: మమత పార్టీలో ముసలం.. నేతల తిరుగుబాటు మొదలు..
-
CM Revanth Reddy: గుజరాత్కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..
-
PM Modi: ప్రధాని మోడీ పర్యటనలో బాంబు కలకలం.. బెంగళూరులో హై టెన్షన్!
-
Kishan Reddy : తెలంగాణకు శుభవార్త.. త్వరలోనే రీజినల్ రింగు రోడ్డు పనులు..!