Sai Pallavi comments on dance shows : డ్యాన్స్ షోలపై హీరోయిన్ సాయిపల్లవి సెన్సేషనల్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Pallavi comments on dance shows : ఈ టీవీలో వచ్చిన ఢీ డ్యాన్స్ షోలో డ్యాన్సర్ గా ఫేమస్ అయిన మళయాళ బ్యూటీ సాయిపల్లవి అదే డ్యాన్స్ షోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్యాన్స్ పోటీల్లో ప్రతిభకు చోటు లేదని, గౌరవం లేదని కేవలం డబ్బుంటేనే డ్యాన్స్ లో గౌరవం ఉంటుందని కామెంట్ చేశారు. సాయి పల్లవి.. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ముందు బుల్లితెర మీద డ్యాన్స్ షోస్ చేసిన విషయం తెలిసిందే. 2008లో తమిళంలో స్టార్ విజయ్ ఛానల్ లో ‘ఉంగళిల్ యార్ అడుత ప్రభుదేవా?’ అనే డ్యాన్స్ షోలోనూ, 2009లో ఈటీవీలో ప్రసారమైన ఢీ4లో పాల్గొంది. ఈ షోస్ లో తనదైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. తమిళ డ్యాన్స్ షోలో అయితే ఫైనల్ వరకూ వెళ్లి రన్నర్ గా నిలిచింది. డ్యాన్స్ షోస్ ద్వారా వెలుగులోకి వచ్చిన సాయిపల్లవి.. ఆ తర్వాత హీరోయిన్ గా స్థిరపడింది. దర్శకుల ఉత్తమ ఎంపికగా సాయి పల్లవి పేరు తెచ్చుకుంది. లేడీ పవర్ స్టార్ గా క్రేజ్ దక్కించుకుంది.
Read Also: Jawan: వివాదాల్లో షారూఖ్ ఖాన్.. కథ కాపీ అంటున్న నిర్మాత
Also Read
- India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
- Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
సాయిపల్లవి ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. హీరోయిన్ అయినప్పటికీ డ్యాన్స్ విషయంలో హీరోలకి పోటీగా డ్యాన్స్ చేస్తుంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సాయి పల్లవి టీవీ డ్యాన్స్ రియాలిటీ షోస్ పై తన అసహనాన్ని వ్యక్తం చేసినట్లు పుకార్లు వస్తున్నాయి. టీవీ ఛానల్స్ లో డబ్బుకే ప్రాధాన్యత ఇస్తారని, ప్రముఖుల వారసులకే మర్యాద, గౌరవం దక్కుతాయని ఆమె అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే తనకు డ్యాన్స్ రియాలిటీ షోస్ పై నమ్మకం లేదని, ఈ డ్యాన్స్ షోలు అంటే తనకు అసహ్యమని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. విన్నర్ అవ్వాల్సిన తనను ప్రముఖుల వారసుల కోసం తొక్కేశారన్న అభిప్రాయంతో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!