Sai Dharam Tej: పవన్ కల్యాణ్తో లెగో బాండింగ్.. అలాంటి సినిమాలే చేస్తాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల జరిగిన గలాట్టా ప్లస్ మెగా ప్యాన్-ఇండియా రౌండ్ టేబుల్ లో సాయి ధరమ్ తేజ్, శృతి హాసన్, శ్రియా రెడ్డి, శోభు యార్లగడ్డ, తరుణ్ భాస్కర్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. అందులో భాగంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడిన మాటలు సినీ అభిమానులను ఆకట్టుకున్నాయి.
ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. తన జీవితంలో తను ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి పంచుకున్నారు. ముఖ్యంగా గతంలో జరిగిన యాక్సిడెంట్ గురించి గుర్తు తెచ్చుకున్నారు. జీవితం మిమ్మల్ని కిందకు నెట్టినా కూడా మళ్లీ పైకి లేపేందుకు మార్గం చూపుతుంది అని తేజు అన్నారు.. దానివల్ల చాలా కాలం సినిమాలకి దూరంగా ఉండి విరూపాక్ష తో విజయం సాధించడం బావుందా అని అడగగా, సినిమా సక్సెస్ కంటే యాక్సిడెంట్ తర్వాత తన జీవితం బావుంది అని అన్నారు. కోమా నుండి కోలుకున్నాక అభిమానుల నుండి వచ్చిన మెసేజెస్ చదవడం తనకి చాలా ఆనందాన్ని కలిగించింది అని ‘విరూపాక్ష’ సక్సెస్ కంటే ఆ సంతోషం ఎక్కువగా ఉంది అని అన్నారు. యాక్సిడెంట్ తర్వాత ఫ్యాన్స్ నుండి వచ్చిన ప్రేమే తనకు నిజమైన విజయం అని చెప్పారు.
Also Read
అలాగే భారతీయ సినిమాలు, హాలీవుడ్ సినిమాల మధ్య తేడా గురించి చెబుతూ సాయి ధరమ్ తేజ్ భారతీయ సినిమాలలో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయని.. స్లో మోషన్ లో సీన్లు ఇండియా సినిమాలకు ప్రత్యేక ఆకర్షణ అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. భారతీయ సినిమాల్లో స్లో మోషన్ సన్నివేశాలు ప్రేక్షకులలో ఎమోషన్స్ పండిస్తాయని.. ముఖ్యంగా హీరోలకి ఎంట్రీ సీన్లు స్లో మోషన్ లో ఉండడం ద్వారా ఫాన్స్ కి విజిలెసే అవకాశం దక్కుతుందని అన్నారు. ఇక మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ ఆయనకి లెగో ఆడడమంటే చాలా ఇష్టమని.. తను ఎప్పుడన్నా తనకు లేదో కొనుక్కుంటే పవన్ కళ్యాణ్ ని కూడా ఒకటి కొనుక్కొని తీసుకెళ్లేవారని చెప్పారు. తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకుంటూ, పవన్ కళ్యాణ్ తనను లెగో ఆడటానికి తరచుగా పిలిచేవారని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
శోభు యార్లగడ్డ ఫిల్మ్ ప్లానింగ్ టెక్నిక్ లు చాలా బాగుంటాయి అని ఆయనను ప్రశంసించారు సాయి ధరమ్ తేజ్. ప్లానింగ్ అనేది సినిమాకి చాలా ముఖ్యమని.. తన రిపబ్లిక్ సినిమా సమయంలో స్టోరీ బోర్డింగ్ మీ.. షాట్ డివిజన్ వంటి ప్లాంట్స్ వల్ల చాలా పనులు అనుకున్న సమయం కంటే సగం సమయంలో పూర్తి చేయడానికి సహాయపడ్డాయని చెప్పారు. కరోనా లాక్ డౌన్ తర్వాత మారుతున్న ప్రేక్షకుల అంచనాల గురించి చెప్తూ.. ప్రజలు అన్ని భాషల్లో సినిమాలు చూడటం అలవాటు చేసుకున్నారు అని, ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నారు అనే దాని కంటే ఎలాంటి సినిమాలు చేస్తున్నారు అనేది మాత్రమే చూస్తున్నారని పేర్కొన్నారు.
ఇక చివరగా.. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ వంటి బోల్డ్ స్క్రిప్ట్ను తనకు చెప్పుంటే తాను హీరోగా చేయడానికి ఒప్పుకో ఉంటారా అని అడగగా, సాయి ధరమ్ తేజ్ అలాంటి ఛాలెంజింగ్ పాత్రల పట్ల ఆసక్తి వ్యక్తం చేశాడు. అలాంటి ఒక బోల్డ్ పాత్రను చేయడం లో తనకి ఆసక్తి ఉంది అన్న తేజ్ అలాంటి పాత్రలను పోషించడానికి ధైర్యం చేసిన రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న వంటి నటులపై తనకున్న అభిమానాన్ని చెప్పుకొచ్చాడు. ఈ విధంగా గలాట్టా ప్లస్ మెగా ప్యాన్-ఇండియా రౌండ్ టేబుల్ 2023 సందర్భంగా సాయి ధరమ్ తేజ్ వ్యక్తిగత.. తన సినీ జీవితం గురించి ఎన్నో విషయాలు అభిమానులతో పంచుకున్నారు. భవిష్యత్తులో ఛాలెంజింగ్ పాత్రలు చేయడానికి రెడీ అని కూడా ఓపెన్ గా చెప్పారు సాయి ధరమ్ తేజ్. ఇక ఆయన ఈ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!