Site icon NTV Telugu

Sabitha Indra Reddy : మూడేళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి కేసీఆర్ రికార్డ్ సృష్టించారు

Minister Sabitha

Minister Sabitha

బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నామన్నారు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ కు పర్యాటక అనుమతులు రావడం సంతోషకరమని ఆమె అన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అని, మూడేళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి కేసీఆర్ రికార్డ్ సృష్టించారని ఆమె కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మాదిరిగా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా త్వరలోనే సీఎం కేసీఆర్ పూర్తి చేస్తారన్నారు.

Also Read : Jailer: ‘జైలర్’కి సూపర్ హిట్ టాక్.. నెల్సన్ ను కలిసి కంగ్రాట్స్ చెప్పిన సీఎం

కోర్టు కేసులతో రాదేమో అనుకున్న పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ రావడం సీఎం కేసీఆర్ సంకల్పంతోనే సాధ్యమైందన్నారు. ఎవరెన్ని అడ్డంకులు, అవరోధాలు సృష్టించిన, ఎన్ని కుట్రలు పన్నినా, చెక్కుచెదరని జన సంకల్పంతో సీఎం కేసీఆర్ అనుమతులు వచ్చేలా కృషి చేశారని ఆమె వ్యాఖ్యానించారు. కొత్త సెక్రటీరియేట్ లో మొదటి సమావేశం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పైనే నిర్వహించి సీఎం కేసీఆర్ ప్రాధాన్యత చాటారని, ఇది చారిత్రాత్మక విజయమన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల లోని 16 నియోజకవర్గాలు,70 మండలాల్లో కృష్ణమ్మ పరుగులు పెట్టనుందన్నారు. సాగు,తాగునీటి,పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడనుందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

Also Read : Jailer: ‘జైలర్’కి సూపర్ హిట్ టాక్.. నెల్సన్ ను కలిసి కంగ్రాట్స్ చెప్పిన సీఎం

Exit mobile version