jaipur: గజరాజుకు కోపం తెప్పించారు.. ఆ తర్వాత ఏం చేసిందంటే..!
జంతువులతో మసులుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చనువు ఇచ్చింది కదా? అని హద్దులు దాటితే మాత్రం వాటి ప్రతాపం చూడాల్సి వస్తోంది. అయినా జంతువుల దగ్గర అప్రమత్తంగా ఉండాలని అటవి శాఖ అధికారులు చెబుతుంటారు. అయినా కూడా కొంత మంది హద్దుమీరుతుంటారు. ఈ మధ్య కేరళలో ఏనుగుల దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా జైపూర్లో జరిగిన ఘటన చూస్తే.. భయాందోళన కలగించింది. ఓ ఏనుగు సృష్టించిన బీభత్సంతో బతుకుజీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డారు. లేదంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. అసలు ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
జైపూర్లోని అమెర్ ఫోర్ట్ దగ్గర సవారీకి ఉపయోగించే ఏనుగు ఒక్కసారిగా తన ప్రతాపం చూపించింది. టూరిస్టులను హఠాత్తుగా గాల్లోకి విసిరేసింది. మహిళా పర్యాటకురాలిని అయితే తొండంతో గిరి గిరి తప్పి విసిరేసింది. దీంతో ఒక రష్యన్ టూరిస్ట్ గాయపడగా.. మరో పర్యాటకురాలికి కాలు విరిగిందని సమాచారం.
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
మొత్తానికి ఇద్దరు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. లేదంటే ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియో కాస్తా అధికారుల దృష్టికి వెళ్లడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. తక్షణమే ఏనుగులను అటవిలోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి, మంత్రులు ఆదేశించారు.
ఈ సంఘటన ఫిబ్రవరి 13న జరిగింది. ఆలస్యంగా వీడియో వెలుగులోకి వచ్చింది. ఏనుగు తన తొండంతో మహిళను పట్టుకుని గిర గిర తిప్పుతూ నేలపైకి విసురుతున్న దృశ్యాలు కనిపించాయి. గాయపడ్డ రష్యన్ పర్యాటకులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గతంలోనూ ఈ ఏనుగు పర్యాటకుల్ని గాయపరిచినట్లుగా తెలుస్తోంది.
Respected @BhajanLalBjp, @KumariDiya, and @ForestRajasthan, frustrated elephant Gouri (ride no 86) has attacked another person. Please send her to a sanctuary and replace the use of elephants with decorated electric cars at Amer Fort. pic.twitter.com/dpgch63RMv
— PETA India (@PetaIndia) February 28, 2024
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!