Maharashtra: పార్కింగ్ విషయంలో గొడవ..పోలీసు చెంప దెబ్బ కొట్టడంతో మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో చిన్న చిన్న గొడవల కారణంతోనే మనుషుల ప్రాణాలను తీసేస్తున్నారు. తమ పంతం నెగ్గించుకోవడం కోసమో, ఇగోల కారణంతోనే ఎదుటివారిపై దాడి చేస్తున్నారు. ప్రాణాలంటే విలువలేకుండా క్షణాల్లో హత్య చేసేస్తున్నారు. తరువాతి పరిణామాలు, జీవితం గురించి ఆలోచించకుండా విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ కారణంగా ఓ వ్యక్తి ప్రాణం కోల్పోయాడు. ఈ ఘర్షణలో విచక్షణ కోల్పోయి ఓ వ్యక్తిని కొట్టింది ఓ పోలీసు అధికారి. మహారాష్ట్రలోని నాగ్పూర్ నగరంలో జరిగింది ఈ షాకింగ్ ఘటన.
Also Read: Viral Video : మెట్రోలో రెచ్చిపోయిన లవర్స్..అందరు చూస్తుండగానే ఆ పని.. వీడియో…
Also Read
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
- Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
- Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
వివరాల ప్రకారం ఎస్ఆర్పీఎఫ్కు చెందిన నిఖిల్ గుప్తా వథోడా పోలిస్ స్టేషన్ పరిధిలో ఉన్న తన చెల్లిల్ని చూడటానికి వచ్చాడు. ఆయన రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పని చేస్తున్నాడు. ఇంటి ముందు కారు పార్క్ చేస్తుండగా హెడ్లైట్ హైబీమ్లో ఉండటంతో అక్కడే ఉంటున్న స్థానికుడు 54 ఏళ్ల వ్యక్తి మురణీధర్ రామరావ్జీ నవారే ఇబ్బంది పడ్డాడు. దీంతో కారు లైట్ లో బీమ్ లో పెట్టి పార్క్ చేయాలని సూచించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాట మాట పెరిగి చేయి చేసుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన నిఖిల్, నవారే చెంపపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ఆయన రెండు రోజుల్లో చనిపోయాడు. నిఖిల్ కొట్టడం వల్లే ఆయన చనిపోయినట్లు వైద్యలు నిర్ధారించారు. దీంతో పోలీసులు నిఖిల్పై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశారు. చిన్న గొడవ ఓ వ్యక్తి ప్రాణాలు తీయడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఆవేశంతో చేసే పనుల వల్ల జీవితాలు ఎలా మారిపోతాయో అనడానికి ఈ ఘటనే నిదర్శనం అని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
-
SBI PO Recruitment 2026: 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు ఎస్బీఐ నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!