Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..

Rohith

Rohith

మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ రాబిన్ ఉతప్ప ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ‘దిస్ ఆర్ దట్’ ఛాలెంజ్ ద్వారా తన భారత వన్డే ఎలెవెన్ (All-time India ODI XI) జట్టును ప్రకటించారు. ఈ జట్టులో రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజాలకు చోటు దక్కకపోవడం గమనార్హం.

ఓపెనర్లు అండ్ మిడిలార్డర్..
రోహిత్ శర్మ, సునీల్ గవాస్కర్‌లను పక్కనపెట్టి సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలను ఓపెనర్లుగా ఉతప్ప ఎంచుకున్నారు. మిడిలార్డర్‌లో 2011 ప్రపంచకప్ విజేత జట్టు సభ్యులైన విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, ఎమ్మెస్ ధోని, సురేష్ రైనాలకు అవకాశం ఇచ్చారు. రాహుల్ ద్రవిడ్, మహ్మద్ అజారుద్దీన్, అజయ్ జడేజాల కంటే వీరికే ప్రాధాన్యతనిచ్చారు. ఈ ఛాలెంజ్‌లో ధోనిని మరెవరితోనూ పోల్చకుండా నేరుగా ఎంపిక చేయడం విశేషం.

భారత 1983 ప్రపంచకప్ కెప్టెన్ కపిల్ దేవ్, రవీంద్ర జడేజాలను ఆల్‌రౌండర్లుగా ఎంపిక చేశారు. హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్‌లకు ఇందులో చోటు దక్కలేదు. ఇక స్పిన్ విభాగంలో వన్డేల్లో భారతదేశం తరఫున అత్యధిక వికెట్లు (334) తీసిన అనిల్ కుంబ్లేకు మొగ్గు చూపారు. హర్భజన్ సింగ్‌ను (265 వికెట్లు) పక్కన పెట్టారు. ఫాస్ట్ బౌలర్లుగా జహీర్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రాలను ఎంచుకున్నారు.

ఈ జట్టులో ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లు ముగ్గురు మాత్రమే ఉన్నారు. వారు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా. వన్డేల్లో 54 శతకాలతో అత్యధిక సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా ఉన్న విరాట్ కోహ్లీ (14,802 పరుగులు), సచిన్ టెండూల్కర్ (18,426 పరుగులు) తర్వాత భారత్ తరఫున రెండో అత్యధిక రన్-స్కోరర్‌గా ఉన్నారు.

రాబిన్ ఉతప్ప వన్డే జట్టు
సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, ఎమ్మెస్ ధోని (కెప్టెన్), సురేష్ రైనా, కపిల్ దేవ్, రవీంద్ర జడేజా, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా.