Rabri Devi Bungalow: బరాబర్ బంగ్లా ఖాళీ చేయం.. అల్టిమేటం జారీ చేసిన ఆర్జేడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rabri Devi Bungalow: రబ్రీ దేవి ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలనే చర్య రాజకీయ ప్రతీకార చర్య అని ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడు మంగని లాల్ మండల్ ఒక కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము ఏమైనా చేస్తామని, కానీ బంగ్లాను మాత్రం ఖాళీ చేయమని స్పష్టంగా ప్రకటించారు. లాలూ యాదవ్, ఆయన కుటుంబంపై రాజకీయ ద్వేషంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండల్ ఆరోపించారు . గత 20 సంవత్సరాలుగా అధికారంలో అనేక మార్పులు జరిగినప్పటికీ, ఈ అంశాన్ని ఎప్పుడూ లేవనెత్తలేదని ఆయన అన్నారు.
READ ALSO: Reliance Hyperscale Data Center: గూగుల్ బాటలో రిలయన్స్.. ఏపీలో మరో భారీ పెట్టుబడి..
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
“ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అక్కడ నివసిస్తున్నారు. ఇప్పటి వరకు ఎందుకు ఇంటిని ఖాళీ చేయమనలేదు? ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు ఇలా చేస్తున్నారు?” అని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోడీ, బీజేపీ నాయకత్వం విశ్వాసాన్ని పొందేందుకు బీహార్ ముఖ్యమంత్రి ఈ చర్య తీసుకున్నారని ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోం శాఖను బీజేపీకి అప్పగించడం లాలూ కుటుంబాన్ని అవమానించడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నంగా అభివర్ణించారు. ఈ చర్యకు రాజకీయాలు తప్ప వేరే కారణం లేదని, హెడింగ్ రోడ్లోని లాలూ యాదవ్ నివాసాన్ని కల్పిత వాదనలతో ఖాళీ చేసే ప్రయత్నం జరుగుతోందని మండల్ వివరించారు.
ఆ బంగ్లా కథ ఏంటి..
పాట్నాలోని ప్రతిష్టాత్మక వీఐపీ ప్రాంతంలో ఉన్న 10 సర్క్యులర్ రోడ్లోని ప్రభుత్వ బంగ్లా దాదాపు ఇరవై ఏళ్లుగా బీహార్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉంది. బీహార్ మాజీ సీఎంలు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి తమ రాజకీయ సభను నిర్వహించి, అధికార వ్యవహారాలను నిశితంగా పరిశీలించిన ఇల్లు ఇది. కానీ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం రబ్రీ దేవిని ఈ చారిత్రాత్మక చిరునామాను ఖాళీ చేయమని ఆదేశించింది. రాష్ట్రంలో 2005 కి ముందు లాలూ ప్రసాద్ యాదవ్ – రబ్రీదేవిలు దాదాపు దశాబ్దంన్నర పాటు అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో మొత్తం కుటుంబం ఏక్ అని మార్గ్లోని ప్రభుత్వ నివాసంలో నివసించారు. అయితే నవంబర్ 2005 లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ఏక్ అని మార్గ్కు మారారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవికి ముఖ్యమంత్రి నివాసానికి నేరుగా ఆనుకుని ఉన్న 10 సర్క్యులర్ రోడ్డులోని బంగ్లాను కేటాయించారు. అప్పుడు ఈ కొత్త నివాసంలోకి లాలూ కుటుంబం మారారు. ఇక అప్పటి నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు వారి శాశ్వత రాజకీయ స్థావరంగా ఈ స్థావరం ఉంది. అధికారాలు చేతులు మారాయి, కానీ బంగ్లా రబ్రీ దేవికే కేటాయించారు.
2015లో గ్రాండ్ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో వారికి 5 దేశరత్న మార్గ్లో ప్రభుత్వ నివాసం మంజూరు చేశారు. 2017లో ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, బంగ్లాను ఖాళీ చేయమని ఆయనకు నోటీసు అందింది. దీనిని తేజస్వి హైకోర్టులో సవాలు చేశారు, కానీ కోర్టు ఆయన పిటిషన్ను కొట్టివేసింది. ఫిబ్రవరి 19, 2019న ఇచ్చిన తీర్పులో హైకోర్టు తేజస్వి నివాసాన్ని ఖాళీ చేయాలని ఆదేశించడమే కాకుండా, మాజీ ముఖ్యమంత్రులందరికీ అందించిన ప్రభుత్వ బంగ్లా, భద్రత, సిబ్బంది హక్కులను కూడా రద్దు చేసింది. ఈ నిర్ణయం రబ్రీ దేవిని కూడా ప్రభావితం చేయడానికి ఉద్దేశించింది. కానీ ఆ సమయంలో ఆమె శాసనమండలిలో ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న కారణంగా, ఆమెకు 10 సర్క్యులర్ రోడ్లో ఉండటానికి అనుమతి లభించింది.
తాజాగా భవన నిర్మాణ శాఖ జాయింట్ సెక్రటరీ కమ్ ల్యాండ్ ప్రాపర్టీ ఆఫీసర్ శివ రంజన్ జారీ చేసిన లేఖలో ప్రతిపక్ష నాయకుడి కోటా నుంచి రబ్రీ దేవికి హార్డింగ్ రోడ్లో నివాసం కేటాయించారు. అందువల్ల ఆమె 10 సర్క్యులర్ రోడ్లోని ఇంటిని ఖాళీ చేయాల్సి ఉంటుందని స్పష్టంగా ఈ లేఖలో పేర్కొన్నారు. అలాగే లాలూ-రబ్రీల పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా తన ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. 26 ఎం. స్ట్రాండ్ రోడ్లోని ఆయన బంగ్లాను కొత్త మంత్రి లఖేంద్ర కుమార్ రోషన్కు కేటాయించారు.
READ ALSO: Cheteshwar Pujara: మాజీ క్రికెటర్ ఇంట్లో విషాదం..
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..