Rishabh Pant: పుండు మీద కారం చల్లడం అంటే ఇదే కాబోలు.. రిషబ్ పంత్కు భారీ జరిమానా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో మంగళవారం రాత్రి జరిగిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ లో మరోసారి ప్రాబ్లమ్ LSGను వెంటాడింది. మూడోసారి స్లో ఓవర్రేట్ ఉల్లంఘనకు పాల్పడినందుకు కెప్టెన్ రిషబ్ పంత్కు రూ. 30 లక్షల భారీ జరిమానా పడింది. అంతేకాదు జట్టులోని ఇక మిగతా ఆటగాళ్లకు రూ. 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజు 50 శాతం (ఏది తక్కువైతే అది) ఫైన్ గా పడింది.
Read Also: Atti Satyanarayana: దిల్ రాజుపై అత్తి సత్యనారాయణ సంచలన కామెంట్స్.. ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ అంటూ..
Also Read
- Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
- Harish Rao: "నీకు మా రక్తం కావాలా".. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
- Vaibhav Sooryavanshi: "టాస్ వేసేదాకా చెప్పలేదు".. తీవ్ర నిరాశతో కన్నీరు పెట్టినంత పని చేసిన వైభవ్.. సీనియర్స్ ఫైర్!
- ICC T20 Ranking: 1,605 రోజుల సామ్రాజ్యం కుప్పకూలింది.. నంబర్ 1 ర్యాంక్ను కోల్పోయిన భారత్!
ఇకపోతే, మ్యాచ్లో రిషబ్ పంత్ తన బ్యాట్తో అద్భుతంగా రాణించాడు. 61 బంతుల్లో 118 పరుగులతో అజేయంగా నిలిచి ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, జట్టు విజయం సాధించలేకపోయింది. బెంగళూరుతో జరిగిన పోరులో 227 పరుగుల భారీ స్కోర్ చేసినా కూడా, ఆ జట్టుకి పరాజయం తప్పలేదు. ఇక ఐపీఎల్ అధికారిక ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం ఓవర్ రేట్ స్లోగా ఉండటంతో, LSG కెప్టెన్ రిషబ్ పంత్కు రూ. 30 లక్షల జరిమానా విధించబడింది. అలాగే మిగతా ఆటగాళ్లకు రూ. 12 లక్షలు లేదా 50 శాతం మ్యాచ్ ఫీజు (ఏది తక్కువ ఉంటే అది) జరిమానాగా విధించబడిందని వెల్లడించారు.
Read Also: Naga Vamsi: టీడీపీకి 25 లక్షల విరాళం..
ఇది లక్నో జట్టుకి మూడవసారి ఓవర్రేట్ ఉల్లంఘన కావడంతో కఠినమైన చర్యలు తీసుకున్నారు. గతంలో కూడా ఏప్రిల్ 4న, 27న ముంబయి ఇండియన్స్తో మ్యాచ్లలో ఇదే తప్పిదాన్ని లక్నో జట్టు చేసింది. ఈ మ్యాచ్లో రిషభ్ పంత్ మంచి ఇన్నింగ్స్ ఆడినా, మరోవైపు జితేశ్ శర్మ అద్భుతంగా చెలరేగాడు. కేవలం 35 బంతుల్లోనే 85 పరుగులు చేసి, ఆర్సీబి జట్టుకు విజయాన్ని అందించాడు. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ కలిసి పవర్ప్లేలో 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, జితేశ్ ఆడిన ఇన్నింగ్స్ తో RCBకి IPL చరిత్రలో అతిపెద్ద విజయవంతమైన ఛేజింగ్గా నిలిచింది. ఈ గెలుపుతో బెంగళూరు జట్టు క్వాలిఫయర్ 1లోకి ప్రవేశించగా, మే 29న పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఇక లక్నో జట్టు ఏడవ స్థానంతో టోర్నమెంట్ను ముగించింది.
తాజావార్తలు
-
Team India: ఓవైపు భారీ ఓటములు.. మరోవైపు అత్యంత చెత్త రికార్డులు.. ఈ టీమిండియాకు ఏమైంది!
-
Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
-
Lenin Box Office Collections: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
-
Kranti Gaud History: ప్రతిష్టాత్మక లార్డ్స్లో క్రాంతి గౌడ్ చరిత్ర.. తొలి బౌలర్గా రేర్ రికార్డు!
-
Harish Rao: “నీకు మా రక్తం కావాలా”.. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..