Rishabh Pant: పుండు మీద కారం చల్లడం అంటే ఇదే కాబోలు.. రిషబ్ పంత్కు భారీ జరిమానా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో మంగళవారం రాత్రి జరిగిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ లో మరోసారి ప్రాబ్లమ్ LSGను వెంటాడింది. మూడోసారి స్లో ఓవర్రేట్ ఉల్లంఘనకు పాల్పడినందుకు కెప్టెన్ రిషబ్ పంత్కు రూ. 30 లక్షల భారీ జరిమానా పడింది. అంతేకాదు జట్టులోని ఇక మిగతా ఆటగాళ్లకు రూ. 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజు 50 శాతం (ఏది తక్కువైతే అది) ఫైన్ గా పడింది.
Read Also: Atti Satyanarayana: దిల్ రాజుపై అత్తి సత్యనారాయణ సంచలన కామెంట్స్.. ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ అంటూ..
Also Read
- UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
ఇకపోతే, మ్యాచ్లో రిషబ్ పంత్ తన బ్యాట్తో అద్భుతంగా రాణించాడు. 61 బంతుల్లో 118 పరుగులతో అజేయంగా నిలిచి ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, జట్టు విజయం సాధించలేకపోయింది. బెంగళూరుతో జరిగిన పోరులో 227 పరుగుల భారీ స్కోర్ చేసినా కూడా, ఆ జట్టుకి పరాజయం తప్పలేదు. ఇక ఐపీఎల్ అధికారిక ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం ఓవర్ రేట్ స్లోగా ఉండటంతో, LSG కెప్టెన్ రిషబ్ పంత్కు రూ. 30 లక్షల జరిమానా విధించబడింది. అలాగే మిగతా ఆటగాళ్లకు రూ. 12 లక్షలు లేదా 50 శాతం మ్యాచ్ ఫీజు (ఏది తక్కువ ఉంటే అది) జరిమానాగా విధించబడిందని వెల్లడించారు.
Read Also: Naga Vamsi: టీడీపీకి 25 లక్షల విరాళం..
ఇది లక్నో జట్టుకి మూడవసారి ఓవర్రేట్ ఉల్లంఘన కావడంతో కఠినమైన చర్యలు తీసుకున్నారు. గతంలో కూడా ఏప్రిల్ 4న, 27న ముంబయి ఇండియన్స్తో మ్యాచ్లలో ఇదే తప్పిదాన్ని లక్నో జట్టు చేసింది. ఈ మ్యాచ్లో రిషభ్ పంత్ మంచి ఇన్నింగ్స్ ఆడినా, మరోవైపు జితేశ్ శర్మ అద్భుతంగా చెలరేగాడు. కేవలం 35 బంతుల్లోనే 85 పరుగులు చేసి, ఆర్సీబి జట్టుకు విజయాన్ని అందించాడు. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ కలిసి పవర్ప్లేలో 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, జితేశ్ ఆడిన ఇన్నింగ్స్ తో RCBకి IPL చరిత్రలో అతిపెద్ద విజయవంతమైన ఛేజింగ్గా నిలిచింది. ఈ గెలుపుతో బెంగళూరు జట్టు క్వాలిఫయర్ 1లోకి ప్రవేశించగా, మే 29న పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఇక లక్నో జట్టు ఏడవ స్థానంతో టోర్నమెంట్ను ముగించింది.
తాజావార్తలు
-
UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
-
KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్పైనే!
-
Yashasvi Jaiswal-ICC: శ్రీలంక పేసర్తో గొడవ.. యశస్వి జైస్వాల్కు ఐసీసీ బిగ్ షాక్!
-
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!