Komatireddy: సచివాలయంలో కోమటిరెడ్డి అధికారులతో సమీక్ష.. రాష్ట్ర రహదారులపై చర్చ
- సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష..
- రాష్ట్రంలో నిర్మిస్తున్న రహదారులపై చర్చ..
- పనుల పురోగతి- వాటి స్థితిగతులపై ఉన్నతాధికారులతో సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ తెలంగాణ సచివాలయంలో ఉదయం 10 గంటలకు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న జాతీయ రహదారులు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రోడ్లు, సిఆర్ఐఎఫ్ రోడ్లు, రూరల్ రోడ్స్, మెడికల్ బిల్డింగ్స్, రాష్ట్ర రహదారులు, ఆర్ఓబీ/ఆర్యూబీల నిర్మాణాలతో పాటు బ్లాక్ స్పాట్ల రిపేర్లకు సంబంధించి వివిధ దశల్లో కొనసాగుతున్న పనుల పురోగతి, వాటి స్థితిగతులపై ఉన్నతాధికారులతో విభాగాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
Read also: Heart Attack : ఈ టీని రోజూ తాగితే హార్ట్ ఏటాక్ జన్మలో రాదు.. ఆ సమస్యలు పరార్..
Also Read
- Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
- High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
- ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
- CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
ఇటీవల కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ఎన్ హెచ్ 65 రోడ్డులో తరచూ రోడ్డు ప్రమాదాలకు కారణాలపై అధికారులతో సమావేశమై చర్చించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్-విజయవాడ రహదారిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. హైవేపై రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న 17 బ్లాక్ స్పాట్ ఏరియాలను అధికారులు వివరించారు. చౌటుప్పల్, పెదకాపర్తి, చిట్యాల, కట్టంగూర్, ఇనుపాముల, టేకుమట్ల, జనగామ క్రాస్ రోడ్స్, ఈనాడు జంక్షన్, దురాజ్ పల్లి జంక్షన్, ముకుందాపురం, ఆకుపాముల, కొమరబండ క్రాస్ రోడ్స్, కటకం గూడెం, మేళ్ల చెరువు, శ్రీరంగాపురం, యాక్సిడెంట్స్ రోడ్డు జరుగుతున్నది. బ్లాక్స్పాట్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చించారు.
Read also: Breaking: ఇరాన్లో భారీ భూకంపం..
వెంటనే సైన్ బోర్డులు, వేగ నియంత్రణ వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రోడ్డుపై కొన్ని చోట్ల ఆరు లైన్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, అండర్ పాస్ ల నిర్మాణం, సర్వీస్ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రమాదరహిత రహదారులుగా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చే సూపర్ గేమ్ ఛేంజర్ ఆర్ఆర్ఆర్ అని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు. ఆర్ఆర్ఆర్ను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
Pawan Kalyan: నేడు బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!