CM Revanth Reddy : మోడీ పరివారం.. గాడ్సే పరివారం
- కుల గణన దేశ వ్యాప్తంగా జరగాలి
- రాహుల్ హామీకి నిలబడ్డాం
- రాహుల్ గాంధీకి మైక్ ఇవ్వలేదు
- మోడీ జాబ్స్ వాగ్దానం.. ఎక్కడ? : సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో కుల గణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణే అని గర్వంగా తెలిపారు. రాష్ట్రంలోని కుల గణనను తాము విజయవంతంగా పూర్తి చేశామని, అదే తరహాలో దేశవ్యాప్తంగా కూడా జనాభా గణనతో పాటు కుల గణన జరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం 21 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేశామని వెల్లడించారు. రైతులపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
పార్లమెంట్లో రాహుల్ గాంధీకి మైక్ ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజల గొంతుక అయిన ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యానికి హానికరమని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారని, కానీ వాస్తవంగా దేశ యువత నిరుద్యోగంతో తల్లడిల్లుతుందని వ్యాఖ్యానించారు. ఆయన పాలనలో దేశానికి అభివృద్ధి కన్నా మోసం ఎక్కువగా జరిగిందని ఆరోపించారు.
Also Read
- Anupama Singh: "మీరు పెంచిన భూతమే మిమ్మల్ని కాటేసింది".. ఐరాసలో పాకిస్థాన్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Monsoon 2026: రైతన్నల్లో మొదలైన టెన్షన్.. జూన్ 4న ఎంట్రీ ఇచ్చినా ముందుకు సాగని రుతుపవన ద్రోణి!
- Sunil Gavaskar: "పంత్, సంజూ కాదు.. 2027 వరల్డ్ కప్లో వికెట్ కీపర్ అతడే".. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
రాహుల్ గాంధీతో కలిసి గాంధీ పరివారమంతా పనిచేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం, సమానత్వం, నైతికత కోసం పోరాడే నాయకుడిగా రాహుల్ గాంధీని ఆదరించాలని కోరారు. కాగా మోడీ పరివారాన్ని గాడ్సే పరివారంగా అభివర్ణించి తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణకు స్వాతంత్య్రం రావడానికి వలభాయ్ పటేల్ పాత్ర ఎంతో గొప్పదని రేవంత్ గుర్తు చేశారు. అయితే, రాష్ట్ర ఏర్పాటు మాత్రం సోనియా గాంధీ ఆశయ ఫలమని తెలిపారు. బ్రిటిష్ వాళ్లు ఎలా దేశ సంపదను లూటీ చేశారో, అదే బాటలో బీజేపీ నాయకులు కూడా నడుస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల ఆస్తులు ప్రైవేటు కార్పొరేట్లకు అప్పగిస్తున్నారని విమర్శించారు. వచ్చే రోజుల్లో దేశం మీద విపరీతంగా పెరుగుతున్న బీజేపీ చెరను తొలగించాలన్న బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలని రేవంత్ పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ అడుగుపెట్టనివ్వకపోవడం తమ గెలుపు సూచిక అని పేర్కొన్నారు.
Minister Kollu Ravindra: మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి.. రూ.32 వేల కోట్ల అప్పులు..!
తాజావార్తలు
-
Delimitation: TMC ఎఫెక్ట్.. నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్! మ్యాజిక్ ఫిగర్ను NDA ఎలా సాధించబోతోంది?
-
Anupama Singh: “మీరు పెంచిన భూతమే మిమ్మల్ని కాటేసింది”.. ఐరాసలో పాకిస్థాన్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Gaza: గాజాలో మరో విషాదం.. ప్రమాదంలో 30వేల మంది పిల్లల జీవితాలు..!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
Aliens: ఏలియన్స్ మనుషులకు కనిపించకపోడానికి కారణమేంటి? సైంటిస్టులు చెప్పిన 3 రీజన్స్
ట్రెండింగ్
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!
-
Sreesanth Challenges Harbhajan: “దమ్ముంటే రింగ్లోకి రా.!” హర్భజన్ సింగ్కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!