CM Revanth Reddy : మోడీ పరివారం.. గాడ్సే పరివారం
- కుల గణన దేశ వ్యాప్తంగా జరగాలి
- రాహుల్ హామీకి నిలబడ్డాం
- రాహుల్ గాంధీకి మైక్ ఇవ్వలేదు
- మోడీ జాబ్స్ వాగ్దానం.. ఎక్కడ? : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో కుల గణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణే అని గర్వంగా తెలిపారు. రాష్ట్రంలోని కుల గణనను తాము విజయవంతంగా పూర్తి చేశామని, అదే తరహాలో దేశవ్యాప్తంగా కూడా జనాభా గణనతో పాటు కుల గణన జరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం 21 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేశామని వెల్లడించారు. రైతులపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
పార్లమెంట్లో రాహుల్ గాంధీకి మైక్ ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజల గొంతుక అయిన ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యానికి హానికరమని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారని, కానీ వాస్తవంగా దేశ యువత నిరుద్యోగంతో తల్లడిల్లుతుందని వ్యాఖ్యానించారు. ఆయన పాలనలో దేశానికి అభివృద్ధి కన్నా మోసం ఎక్కువగా జరిగిందని ఆరోపించారు.
Also Read
- Assembly Elections: తమిళనాడు, బెంగాల్లో పోటాపోటీగా పోలింగ్.. ఉ.11 గంటలకు భారీగా ఓటింగ్
- Venkata Krishnapuram Crime: లీడ్ కనుక్కునేందుకు ఎవ్వరూ ప్రాణాలతో లేరు.. వెంకటకృష్ణపాలెంలో విషాదంపై పుత్తూరు డీఎస్పీ!
- Mukesh Choudhary: ఐపీఎల్ నుండి మధ్యలోనే మరో CSK ప్లేయర్ అవుట్..!
- Trump-Iran: ‘‘ట్రంప్.. నోర్మూయ్’’.. సీజ్ఫైర్ పొడిగింపుపై ఇరాన్ సెటైర్ వీడియో
రాహుల్ గాంధీతో కలిసి గాంధీ పరివారమంతా పనిచేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం, సమానత్వం, నైతికత కోసం పోరాడే నాయకుడిగా రాహుల్ గాంధీని ఆదరించాలని కోరారు. కాగా మోడీ పరివారాన్ని గాడ్సే పరివారంగా అభివర్ణించి తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణకు స్వాతంత్య్రం రావడానికి వలభాయ్ పటేల్ పాత్ర ఎంతో గొప్పదని రేవంత్ గుర్తు చేశారు. అయితే, రాష్ట్ర ఏర్పాటు మాత్రం సోనియా గాంధీ ఆశయ ఫలమని తెలిపారు. బ్రిటిష్ వాళ్లు ఎలా దేశ సంపదను లూటీ చేశారో, అదే బాటలో బీజేపీ నాయకులు కూడా నడుస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల ఆస్తులు ప్రైవేటు కార్పొరేట్లకు అప్పగిస్తున్నారని విమర్శించారు. వచ్చే రోజుల్లో దేశం మీద విపరీతంగా పెరుగుతున్న బీజేపీ చెరను తొలగించాలన్న బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలని రేవంత్ పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ అడుగుపెట్టనివ్వకపోవడం తమ గెలుపు సూచిక అని పేర్కొన్నారు.
Minister Kollu Ravindra: మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి.. రూ.32 వేల కోట్ల అప్పులు..!
తాజావార్తలు
-
Assembly Elections: తమిళనాడు, బెంగాల్లో పోటాపోటీగా పోలింగ్.. ఉ.11 గంటలకు భారీగా ఓటింగ్
-
Venkata Krishnapuram Crime: లీడ్ కనుక్కునేందుకు ఎవ్వరూ ప్రాణాలతో లేరు.. వెంకటకృష్ణపాలెంలో విషాదంపై పుత్తూరు డీఎస్పీ!
-
Mukesh Choudhary: ఐపీఎల్ నుండి మధ్యలోనే మరో CSK ప్లేయర్ అవుట్..!
-
Trump-Iran: ‘‘ట్రంప్.. నోర్మూయ్’’.. సీజ్ఫైర్ పొడిగింపుపై ఇరాన్ సెటైర్ వీడియో
-
Ranveer Singh : దీపికాకు పూర్తి ఆపోజిట్గా వ్యవహరిస్తున్న రణవీర్ సింగ్
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?