తెలుగు ప్రేక్షకులో రెజీనా కసాండ్రా అంటే ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. తన క్యూట్ లుక్స్తో, నేచురల్ యాక్టింగ్తో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. కేవలం సౌత్కే పరిమితం కాకుండా బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. అయితే వెండితెరపై మెరిసే బాలీవుడ్ రంగుల ప్రపంచం వెనుక ఉన్న మరో కోణాన్ని రెజీనా తాజాగా బయటపెట్టింది. హిందీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి.
Also Read : Chiranjeevi : సురేఖే నా సర్వస్వం.. 44 ఏళ్ల బంధంపై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్!
రెజీనా మాట్లాడుతూ.. ‘ 2019లో ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చా. హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో అక్కడి వారు నను ఒక నటిగా కంటే ‘సౌత్ నుంచి వచ్చిన అమ్మాయి’గానే చూశారు. సాధారణంగా మన సౌత్ హీరోయిన్లకు హిందీ రాదనే ఒక అపోహ వారిలో ఉంటుంది. కానీ నాకు హిందీ చదవడం, రాయడం, మాట్లాడటం అన్నీ వచ్చు. నా సినిమాలకు నేనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నా సరే.. అక్కడ కొందరు మాత్రం ‘బయటి వ్యక్తి’లాగే ట్రీట్ చేశారట. కేవలం మాటలతోనే కాదు, ప్రవర్తనలో కూడా నను చిన్నచూపు చూసిన సందర్భాలు ఉన్నాయి. సౌత్ నుంచి వచ్చాననే కారణంతో అవమానకరంగా ప్రవర్తించారు, అది నాను ఎంతో బాధించింది. కానీ అందరూ అలాగే ఉండరు, కొంతమంది దర్శకులు, నటులు ఎంతో ప్రొఫెషనల్గా ఉంటారు. వారి వల్లే నేను ఆ కష్టమైన దశను దాటగలిగా’ అని తెలిపింది రెజీనా. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి చర్చకు దారితీశాయి.
