ప్రముఖ మొబైల్ కంపెనీ రెడ్ మీ నుంచి సరికొత్త ఫీచర్స్ తో కొత్త మొబైల్స్ వస్తూనే ఉంటాయి.. తాజాగా మరో బడ్జెట్ ఫోన్ ను విడుదల చేశారు.. రెడ్మీ నోట్ 13ఆర్ పేరుతో ఈ ఫోన్ను చైనాలో లాంచ్ చేయగా.. త్వరలోనే ఇండియాలోకి రాబోతుందని తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ ఫోన్ ఫీచర్స్, ధర ఆన్లైన్లో విడుదల అయ్యాయి.. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం..
ఈ కొత్త ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.79 ఇంచెస్తో కూడిన డిస్ప్లేను అందించారు. అలాగే ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్తో పని చేస్తుంది.. అలాగే ఈ ఫోన్ ఐదు వెరియంట్లలో వస్తున్నాయి.. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస 5030 ఎంఏహెచ్ కెసాపిటీ బ్యాటరీని అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు.. సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ లో రాబోతుంది..
ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. ఈ ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ మన కరెన్సీలో రూ. 16 వేలు, 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.19 వేలు, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.21 వేలు, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ లో అయితే రూ.23 వేలు, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ అయితే రూ. 25 వేలు వరకు ఉంటుందని తెలుస్తుంది.. త్వరలోనే ఈ ఫోన్ ప్రీ సేల్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది..