NTV Telugu Site icon

Redmi Note 13 Pro 5G : రెడ్ మీ కొత్త ఫోన్ కొంటున్నారా? ఇది ఒకసారి చూడండి..

Red Mii (2)

Red Mii (2)

ప్రముఖ మొబైల్ కంపెనీ రెడ్ మీ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో అదిరిపోయే మొబైల్స్ ను మార్కెట్ లోకి వదులుతుంది.. రీసెంట్ వచ్చిన మొబైల్ కు మంచి స్పందన వచ్చింది.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ను అధికారిక వెబ్ సైట్ లో ప్రకటించింది.. రెడ్ మీ నోట్ 13 ప్రో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఆ ఫోన్ మరో వేరియంట్ ను మార్కెట్ లోకి లాంచ్ చేశారు.. ఆ కొత్త ఫోన్ ఫీచర్స్, ధర గురించి ఒక లుక్ వేద్దాం..

ఈ రెడ్‌మి నోట్ 13ప్రో 5జీ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 ఎస్ఓసీపై రన్ అవుతుంది. 200ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంది. 67డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,100mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్పెసిఫికెషన్స్ లో ఎటువంటి మార్పులు లేవు.. కేవలం కొత్త కలర్ తో మాత్రమే మొబైల్ ను మార్కెట్ లోకి వదిలింది. రెడ్‌మి నోట్ 13 ప్రో 5జీని స్కార్లెట్ రెడ్ కలర్ ఆప్షన్‌లో ప్రారంభించినట్లు ప్రకటించింది. అమెజాన్, ఎంఐ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ఇతర ప్రధాన రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా మీరు కొనుగోలు చెయ్యొచ్చు..

గతంలో లాంచ్ చేసిన ఫోన్ ను నుంచి గతంలో ఆర్కిటిక్ వైట్, కోరల్ పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లతో పాటు కొత్త షేడ్ అందిస్తోంది. రెడ్‌మి ఇటీవల భారత్ వెలుపల గ్లోబల్ మార్కెట్లలో ఆలివ్ గ్రీన్ షేడ్‌లో మార్కెట్ లోకి విడుదల చేసింది.. ఈ ఫోన్ ఫీచర్స్, ధరలో మార్పులు లేవు కానీ కలర్ ఆఫ్షన్ ఒక్కటే మారింది.. ఇక ఫోన్ ధర విషయానికొస్తే.. రెడ్‌మి నోట్ 13ప్రో 5జీ స్కార్లెట్ రెడ్ కలర్ వేరియంట్ భారత్‌లో ఇతర కలర్ ఆప్షన్లలో ధరలోనే ఉంది. ఈ ఫోన్ రూ. 25,999 బేస్ 8జీబీ+ 128జీబీ స్టోరేజీ, 12జీబీ+ 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌లకు రూ. 27,999 వరకు ఉంటుంది..