RCB Stampede: తొక్కిసలాట ఘటనపై బీజేపీ సంచలన ఆరోపణలు.. దీనికి కారణం మీరే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ కార్యక్రమం సందర్భంగా పెను విషాదం చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్ర బౌరింగ్, లేడీ కర్జన్ ఆస్పత్రికి చేరుకున్నారు. గాయపడిన వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర మాట్లాడుతూ.. “ఈ విషాదానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. మొత్తం దేశం, కర్ణాటక ఆర్సీబీ విజయాన్ని ఘనంగా నిర్వహించారు. కానీ.. ముందస్తు సన్నాహాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం విజయ ర్యాలీని నిర్వహించడానికి తొందరపడటం ఈ విషాదానికి దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు సన్నాహాల గురించి పట్టించుకోలేదు. వారు ప్రచారంపై ఎక్కువ ఆసక్తి చూపారు. దీని ఫలితంగా 11 మందికి పైగా మరణించారు. కొంతమంది ఐసీయూలో ఉన్నారు. నేను కొంతమంది బాధితులతో మాట్లాడాను, లోపల పోలీసులు లేరు, అంబులెన్స్ సౌకర్యం లేదు. ముఖ్యమంత్రి ఈ విషయాన్ని న్యాయ విచారణకు పంపాలి.” అని ఆయన డిమాండ్ చేశారు.
READ MORE: గుండె చికిత్సలో మరో మైలురాయి.. KONAR-MF డివైస్కు యూఎస్ పేటెంట్..!
Also Read
- Sugar Prices: చక్కెర ధరలపై గుడ్న్యూస్.. దిగిరానున్న ధరలు
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
- Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
ఈ అంశంపై డిప్యూటీ సీఎం శివకుమార్ స్పందించారు. “నేను పోలీస్ కమిషనర్తో, అందరితో మాట్లాడాను. నేను కూడా తర్వాత ఆసుపత్రికి వెళ్తాను. మృతుల సంఖ్యను ఇప్పుడు చెప్పలేం. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఘటన కారణంగా ఈ కార్యక్రమాన్ని కుదించాం. కార్యక్రమం 10 నిమిషాల్లో ముగిసింది. లక్షల మంది వచ్చారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు యత్నిస్తున్నాం.” అన్నారు. బీజేపీ ఆరోపణలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డికె శివకుమార్ స్పందించారు. వారు ఆరోపణలు చేయడానికే ఉన్నారు. మేము రక్షించడానికి ఉన్నామని వెల్లడించారు.
READ MORE: Virat Kohli: “ఇలాంటి ఫ్యాన్స్ ఏ జట్టుకూ ఉండరు”.. విరాట్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
#WATCH | Bengaluru: On the stampede during RCB victory celebrations, Karnataka BJP President BY Vijayendra says, "The state government should take full responsibility for this tragedy. When the whole country and Karnataka were celebrating RCB's victory, the state government's… pic.twitter.com/M7nUBc9vZN
— ANI (@ANI) June 4, 2025
తాజావార్తలు
-
Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
-
Sugar Prices: చక్కెర ధరలపై గుడ్న్యూస్.. దిగిరానున్న ధరలు
-
CM Revanth Reddy : కొండా సురేఖ ఎపిసోడ్పై రేవంత్ క్లారిటీ.. కీలక వ్యాఖ్యలు..
-
Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
-
Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్పై స్టే ఎత్తివేత.. కానీ..!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!