Ravindra Jadeja: రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా ఈ ముగ్గురు సీఎస్కేలో ఎంత ఉత్సాహంగా ఉండే వాళ్లో చెప్పనవసరం లేదు. అయితే.. రైనా టీ20 కేరీర్కి గుడ్ బై చెప్పగా.. ధోనీ, జడేజా వేర్వేరు టీమ్లలో ఆడుతున్నారు. ధోనీ ఇప్పటికీ సీఎస్కేను విడవలేదు. గత 12 ఏళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో అంతర్భాగంగా ఉన్న రవీంద్ర జడేజా, ఈ ఏడాది మళ్ళీ తన పాత జట్టు రాజస్థాన్ రాయల్స్ (RR) తరపున బరిలోకి దిగాడు. దీంతో అభిమానులకు కొంత ఆశ్చర్యాన్ని, మరికొంత భావోద్వేగాన్ని కలిగించింది. ఇక సోమవారం జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్ (RR) మ్యాచ్లో జడేజా బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కళ్లు చెమ్మగిల్లాయి. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన మాజీ జట్టు కష్టాల్లో ఉండటం చూసి జడేజా ఎమోషనల్ అయ్యాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
READ MORE:CSK-MS Dhoni: ‘ధోని’ లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) గెలవలేదా..? ఆయన లేని లోటు స్పష్టంగా..
వాస్తవానికి.. 19వ సీజన్కు ముందు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్ ఒప్పందం జరిగింది. ఇందులో రవీంద్ర జడేజా, సంజు శామ్సన్లను ఇరు జట్లు పరస్పరం మార్చుకున్నాయి. ఈ ట్రేడ్ తర్వాత ఇరు జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సమయంలో సీఎస్కే అభిమానుల ప్రేమను చూసి జడేజా భావోద్వేగానికి గురవడం కనిపించింది. ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి చెన్నై జట్టుకు పెద్ద దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత, తుపాకీ పేలుస్తున్నట్లుగా జడేజా చేసిన విలక్షణమైన సంబరం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దుబేల కీలక వికెట్లను పడగొట్టాడు. ఈ మ్యాచ్లో జడేజా మూడు ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత జడ్డూ బౌండరీ సమీపంలో ఫీల్డింగ్కు వెళ్లగానే, సీఎస్కే అభిమానులు ‘జడ్డూ జడ్డూ’ అని నినాదాలు చేయడం మొదలుపెట్టారు. అభిమానుల ప్రేమకు ముగ్ధుడైన జడ్డూ భావోద్వేగానికి లోనయ్యాడు. అతని భావోద్వేగభరితమైన ఫోటో, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జెర్సీ మార్చిన తర్వాత కూడా జడ్డూపై చెన్నై అభిమానుల ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ‘జడ్డూ-జడ్డూ’ నినాదాలు విన్న రవీంద్ర జడేజా కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు.
READ MORE: Marco Rubio-Iran: ‘‘మా కంటే వారికే ఎక్కువ నష్టం’’.. హార్ముజ్పై మార్కో రూబియో హెచ్చరిక
