Ravi Naidu: రోజా అయినా, బైరెడ్డి అయినా.. ఎవరినీ విడిచిపెట్టేది లేదు!
- రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం
- జాతీయ స్థాయి క్రీడా కారులకు అందాల్సిన గౌరవం అందలేదు
- ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ హాజరు
- ఆడుదాం ఆంధ్రాని రాజకీయంగా వాడుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Naidu Warns Action on Aadudam Andhra Scam: గత వైసీపీ ప్రభుత్వ నాయకులు ‘ఆడుదాం ఆంధ్రా’ని రాజకీయంగా వాడుకున్నారని, నిధుల దుర్వినియోగం భారిగా చేశారని ఏపీ శాప్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) ఛైర్మన్ రవి నాయుడు అన్నారు. గతంలో రూ.280 కోట్లు నిధులతో పారా అథ్లెటిక్స్ ట్రైనింగ్ కోసం కేటాయిస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, మళ్లీ కూటమి ప్రభుత్వం వాటి కోసం కృషి చేస్తుందన్నారు. ఆడుదాం ఆంధ్రా విజిలెన్స్ పూర్తి అయిందని, ఏ రోజైనా చర్యలు తీసుకోవడానికి సిద్దం అని తెలిపారు. తప్పు చేసిన వారిని విడిచి పెట్టేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని రవి నాయుడు హెచ్చరించారు.
‘జాతీయ క్రీడా దినోత్సవ సందర్భంగా విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం. గతంలో నేషనల్ స్పోర్ట్స్ డే అనగానే.. ఓ నలుగురికి శాలువాలతో సన్మానాలు, సత్కారాలు చేసి చేతులు దులిపేసుకున్నారు. జాతీయ స్థాయి క్రీడా కారులకు అందాల్సిన గౌరవం అందలేదు. కానీ ఈ సారి మాత్రం క్రీడాకారులకు పెద్ద పీట వేస్తాము. మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అంతర్జాతీయ స్థాయి కోచ్లు పుల్లెల గోపీచంద్, కోనేరు హంపి, ఏమ్మేస్కే ప్రసాద్ సహా యువ అథ్లెట్ ఎర్ర జ్యోతి వంటి ప్రతిభ కలిగిన క్రీడాకారులను భాగస్వాములుగా చేస్తున్నాం. చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. 3 శాతం డీఎస్సీలో 421 పోస్టులు క్రీడా ప్రాతిపదికన కేటాయించడం జరిగింది. ఫారెస్ట్ విభాగంలో కూడా 40 పోస్టులు కేటాయించాము. 480 మంది క్రీడా కారులకు సన్మానాలు, నగదు ప్రోత్సాహకాలు అందిస్తాం. 28 వేల మంది క్రీడాకారులు స్పోర్ట్స్ డే వేడుకలలో భాగస్వాములు అవుతారు. ఆగస్టు నెలను స్పోర్ట్స్ మంత్ గా పరిగణిస్తాం. భవిష్యత్లో మరిన్ని స్పోర్ట్స్ అకాడమీలు తీసుకు వస్తాం’ అని రవి నాయుడు తెలిపారు.
Also Read
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
Also Read: Prithvi Shaw: టాలీవుడ్ హీరోయిన్తో పృథ్వీ షా డేటింగ్.. ఫొటోస్ వైరల్!
‘ఆడుదాం ఆంధ్రాని రాజకీయంగా వాడుకున్నారు. నిధుల దుర్వినియోగం చేశారు. గతంలో రూ.280 కోట్లు నిధులతో పారా అథ్లెటిక్స్ ట్రైనింగ్ కోసం కేటాయిస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మళ్లీ కూటమి ప్రభుత్వం వాటి కోసం కృషి చేస్తుంది. ఆడుదాం ఆంధ్రా విజిలెన్స్ పూర్తి అయింది. ఏ రోజైనా చర్యలు తీసుకోవడానికి సిద్దం. తప్పు చేసిన వారిని ఎవరినీ విడిచిపెట్టేది లేదు. చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం. కక్ష్య పూరిత రాజకీయాలు చేయడం లేదు. అవినీతి జరిగిందని స్పష్టంగా వెల్లడి అయింది. ఆర్కే రోజా ఆయినా, బైరెడ్డి సిద్దార్థరెడ్డి అయినా ఎవరినీ విడిచిపెట్టేది లేదు’ అని రవి నాయుడు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!