నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్తో కలిసి ‘కాక్టెయిల్ 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హోమీ అడజానియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక, షాహిద్ ప్రేమికులుగా సందడి చేయబోతున్నారు. అయితే, ఈ సినిమా విడుదల కాకముందే వీరిద్దరి కాంబినేషన్లో మరో కొత్త ప్రాజెక్ట్ ఖరారైందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read : Ragi Topa : రక్తహీనతకు చెక్ పెట్టే ‘రాగి తోప’.. అమ్మమ్మల కాలం నాటి ఈ సూపర్ ఫుడ్తో బోలెడన్ని లాభాలు!
ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమాలో రష్మిక, షాహిద్ భార్యాభర్తలుగా కనిపించబోతున్నారట. ఇది ఒక ‘సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ’ డ్రామా అని సమాచారం. వైవాహిక జీవితంలో వచ్చే ఇబ్బందులకు సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తోడైతే ఎలా ఉంటుందనేది ఈ సినిమా కథాంశం అని తెలుస్తోంది. ‘బదాయి హో’, ‘మైదాన్’ వంటి సినిమాలతో తన మార్క్ చూపించిన దర్శకుడు అమిత్ శర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానుందని బాలీవుడ్ వర్గాల సమాచారం.
