Site icon NTV Telugu

Rape And Kidnap: మహిళపై అత్యాచారం.. ఆ తర్వాత తన కుమార్తెను కిడ్నాప్ చేసిన తాంత్రికుడు..!

Rape Case

Rape Case

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. తాంత్రికుడి ఇంటి బయట ఓ మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. తాంత్రికుడు మొదట తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. ఆ తర్వాత తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని మహిళ ఆరోపించింది. ఈ విషయమై మహిళ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అయితే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడంలో జాప్యం జరగడంతో ఆ మహిళ సోమవారం తాంత్రికుని ఇంటి బయట ధర్నాకు దిగింది. మరోవైపు తాంత్రికుడి బంధువులు ఆ మహిళను పంపించాలని చూడగా.. పురుగుల మందు తాగింది.

Daksha Nagarkar: ట్యాలెంట్ చూపిస్తున్నా.. పిల్లను పట్టించుకోరేంటయ్యా

వివరాల్లోకి వెళ్తే.. ప్రయాగ్‌రాజ్‌లోని పూరముఫ్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్ బిహ్రా నివాసి అయిన మహిళ భర్త మదన్‌కు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆ వ్యాధిని నయం చేసేందుకు ఆ తాంత్రికుడు దగ్గరికి తీసుకురాగా.. ఆ మహిళపై కన్ను పడింది. దీంతో తాంత్రికుడు మొదట మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడని.., ఆ తర్వాత ఆమె కుమార్తెను కిడ్నాప్ చేశాడని ఆరోపించారు. ఈ విషయమై సదరు మహిళ తాంత్రికుపై పిప్రి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. నిందితుడు తాంత్రిక్ ఇంటి బయట మహిళ ధర్నాకు దిగిందని తెలిపారు. ఆ మహిళా తన కూతురిని వదిలేయాలని ఫోన్ లో కోరగా.. ఈ విషయమై తాంత్రికుడితో గొడవ పడ్డాడు. దీని తర్వాత నిందితుడి బంధువులు ఆమెను అక్కడనుంచి పంపించడానికి ప్రయత్నించారు. మరోవైపు బాధితురాలు తన బిడ్డను తనకు అప్పగించాలని.. లేదంటే విషం తాగుతానంటూ బెదిరించి విషం తాగింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

South Central Railway: వారంలో హైదరాబాద్-ఢిల్లీ రూట్‌లో బాలాసోర్ లాంటి ప్రమాదం.. రైల్వేకి హెచ్చరిక లేఖ?

సమాచారం అందుకున్న పిప్రి పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఆ తాంత్రికుడు మహిళ యొక్క 15 ఏళ్ల కుమార్తెపై కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుడి బారి నుంచి కూతురిని విడిపించేందుకు ఆ మహిళ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో జూన్ 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితులు తాంత్రిక్ రాజు, అతని ముగ్గురు సోదరులు విజయ్, అమర్, సురేంద్రలపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Exit mobile version