Ranbir Kapoor: రామాయణలో రణబీర్ ‘డబుల్’ ధమాకా.. రాముడితో పాటు ఆ పవర్ఫుల్ రోల్లోనూ ఆయనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranbir Kapoor: భారతీయ చలనచిత్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో, అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ (Ramayana) చిత్రం గురించి రోజుకో సంచలన వార్త బయటకు వస్తోంది. రణ్బీర్ కపూర్ హీరోగా, నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్ గురించి తాజాగా రణ్బీర్ పంచుకున్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ కేవలం శ్రీరాముడిగానే కాకుండా, మరో పవర్ఫుల్ రోల్లోనూ కనిపించబోతున్నారట.
READ ALSO: Ibrahimpatnam: ఉత్కంఠకు తెర.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కిందంటే..?
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
ఈ సినిమాలో తాను ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు రణ్బీర్ కపూర్ స్వయంగా వెల్లడించారు. శ్రీరాముడి పాత్రతో పాటు, విష్ణుమూర్తి ఆరో అవతారమైన పరశురాముడి పాత్రను కూడా ఆయనే పోషిస్తున్నారట. “ఒకే సినిమాలో రాముడు, పరశురాముడు వంటి పురాణ పురుషుల పాత్రలు పోషించడం నా అదృష్టం. ఈ పాత్రల కోసం ఏడాది పాటు శ్రమించాను. కేవలం బాడీ లాంగ్వేజ్ మాత్రమే కాదు, వారి వెనకున్న ఆధ్యాత్మికతను కూడా అర్థం చేసుకున్నాను” అని రణ్బీర్ చెప్పుకొచ్చారు.
మరోవైపు, ఈ సినిమా బిజినెస్ లెక్కలు ఇండస్ట్రీ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. ‘రామాయణ’ రెండు భాగాల డిజిటల్ హక్కుల కోసం ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఏకంగా రూ. 1000 కోట్ల భారీ ఆఫర్ను నిర్మాత నమిత్ మల్హోత్రా ముందు ఉంచిందట. అయితే, ఆయన ఈ డీల్ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇటీవల ‘ధురంధర్’ చిత్రబృందం అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ కూడా అమలు చేయాలని నిర్మాత భావిస్తున్నారు. మొదటి భాగం విడుదలయ్యాక వచ్చే రెస్పాన్స్ను బట్టి, రెండో భాగానికి మరింత భారీ ధరకు డీల్ కుదుర్చుకోవచ్చని ఆయన ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రం దాదాపు రూ.4000 కోట్ల అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతోంది. ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ పూర్తి చేసుకుని వీఎఫ్ఎక్స్ (VFX) పనుల్లో ఉంది. ఇందులో రణ్బీర్ సరసన సీతగా సాయి పల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. అలాగే కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్పై భారీ విజయంపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Ramayana: ‘రామాయణ’లో..సాయి పల్లవిపై మేకర్స్ కీలక నిర్ణయం!
-
Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్తలు!
-
Pat Cummins: “ఏం పర్వాలేదు.. ప్లేఆఫ్స్కు ఇంకా ఛాన్స్ ఉందిగా”.. కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!