Ranbir Kapoor: రామాయణలో రణబీర్ ‘డబుల్’ ధమాకా.. రాముడితో పాటు ఆ పవర్ఫుల్ రోల్లోనూ ఆయనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranbir Kapoor: భారతీయ చలనచిత్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో, అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ (Ramayana) చిత్రం గురించి రోజుకో సంచలన వార్త బయటకు వస్తోంది. రణ్బీర్ కపూర్ హీరోగా, నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్ గురించి తాజాగా రణ్బీర్ పంచుకున్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ కేవలం శ్రీరాముడిగానే కాకుండా, మరో పవర్ఫుల్ రోల్లోనూ కనిపించబోతున్నారట.
READ ALSO: Ibrahimpatnam: ఉత్కంఠకు తెర.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కిందంటే..?
Also Read
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
- Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
- Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్వాచ్లు అందుబాటులోకి..
ఈ సినిమాలో తాను ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు రణ్బీర్ కపూర్ స్వయంగా వెల్లడించారు. శ్రీరాముడి పాత్రతో పాటు, విష్ణుమూర్తి ఆరో అవతారమైన పరశురాముడి పాత్రను కూడా ఆయనే పోషిస్తున్నారట. “ఒకే సినిమాలో రాముడు, పరశురాముడు వంటి పురాణ పురుషుల పాత్రలు పోషించడం నా అదృష్టం. ఈ పాత్రల కోసం ఏడాది పాటు శ్రమించాను. కేవలం బాడీ లాంగ్వేజ్ మాత్రమే కాదు, వారి వెనకున్న ఆధ్యాత్మికతను కూడా అర్థం చేసుకున్నాను” అని రణ్బీర్ చెప్పుకొచ్చారు.
మరోవైపు, ఈ సినిమా బిజినెస్ లెక్కలు ఇండస్ట్రీ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. ‘రామాయణ’ రెండు భాగాల డిజిటల్ హక్కుల కోసం ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఏకంగా రూ. 1000 కోట్ల భారీ ఆఫర్ను నిర్మాత నమిత్ మల్హోత్రా ముందు ఉంచిందట. అయితే, ఆయన ఈ డీల్ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇటీవల ‘ధురంధర్’ చిత్రబృందం అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ కూడా అమలు చేయాలని నిర్మాత భావిస్తున్నారు. మొదటి భాగం విడుదలయ్యాక వచ్చే రెస్పాన్స్ను బట్టి, రెండో భాగానికి మరింత భారీ ధరకు డీల్ కుదుర్చుకోవచ్చని ఆయన ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రం దాదాపు రూ.4000 కోట్ల అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతోంది. ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ పూర్తి చేసుకుని వీఎఫ్ఎక్స్ (VFX) పనుల్లో ఉంది. ఇందులో రణ్బీర్ సరసన సీతగా సాయి పల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. అలాగే కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
-
Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్లో సమస్యలే
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్వాచ్లు అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?