Ranbir Kapoor: రామాయణలో రణబీర్ ‘డబుల్’ ధమాకా.. రాముడితో పాటు ఆ పవర్ఫుల్ రోల్లోనూ ఆయనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranbir Kapoor: భారతీయ చలనచిత్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో, అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ (Ramayana) చిత్రం గురించి రోజుకో సంచలన వార్త బయటకు వస్తోంది. రణ్బీర్ కపూర్ హీరోగా, నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్ గురించి తాజాగా రణ్బీర్ పంచుకున్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ కేవలం శ్రీరాముడిగానే కాకుండా, మరో పవర్ఫుల్ రోల్లోనూ కనిపించబోతున్నారట.
READ ALSO: Ibrahimpatnam: ఉత్కంఠకు తెర.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కిందంటే..?
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఈ సినిమాలో తాను ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు రణ్బీర్ కపూర్ స్వయంగా వెల్లడించారు. శ్రీరాముడి పాత్రతో పాటు, విష్ణుమూర్తి ఆరో అవతారమైన పరశురాముడి పాత్రను కూడా ఆయనే పోషిస్తున్నారట. “ఒకే సినిమాలో రాముడు, పరశురాముడు వంటి పురాణ పురుషుల పాత్రలు పోషించడం నా అదృష్టం. ఈ పాత్రల కోసం ఏడాది పాటు శ్రమించాను. కేవలం బాడీ లాంగ్వేజ్ మాత్రమే కాదు, వారి వెనకున్న ఆధ్యాత్మికతను కూడా అర్థం చేసుకున్నాను” అని రణ్బీర్ చెప్పుకొచ్చారు.
మరోవైపు, ఈ సినిమా బిజినెస్ లెక్కలు ఇండస్ట్రీ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. ‘రామాయణ’ రెండు భాగాల డిజిటల్ హక్కుల కోసం ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఏకంగా రూ. 1000 కోట్ల భారీ ఆఫర్ను నిర్మాత నమిత్ మల్హోత్రా ముందు ఉంచిందట. అయితే, ఆయన ఈ డీల్ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇటీవల ‘ధురంధర్’ చిత్రబృందం అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ కూడా అమలు చేయాలని నిర్మాత భావిస్తున్నారు. మొదటి భాగం విడుదలయ్యాక వచ్చే రెస్పాన్స్ను బట్టి, రెండో భాగానికి మరింత భారీ ధరకు డీల్ కుదుర్చుకోవచ్చని ఆయన ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రం దాదాపు రూ.4000 కోట్ల అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతోంది. ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ పూర్తి చేసుకుని వీఎఫ్ఎక్స్ (VFX) పనుల్లో ఉంది. ఇందులో రణ్బీర్ సరసన సీతగా సాయి పల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. అలాగే కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!