Ranbir Kapoor: రామాయణలో రణబీర్ ‘డబుల్’ ధమాకా.. రాముడితో పాటు ఆ పవర్ఫుల్ రోల్లోనూ ఆయనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranbir Kapoor: భారతీయ చలనచిత్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో, అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ (Ramayana) చిత్రం గురించి రోజుకో సంచలన వార్త బయటకు వస్తోంది. రణ్బీర్ కపూర్ హీరోగా, నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్ గురించి తాజాగా రణ్బీర్ పంచుకున్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ కేవలం శ్రీరాముడిగానే కాకుండా, మరో పవర్ఫుల్ రోల్లోనూ కనిపించబోతున్నారట.
READ ALSO: Ibrahimpatnam: ఉత్కంఠకు తెర.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కిందంటే..?
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
ఈ సినిమాలో తాను ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు రణ్బీర్ కపూర్ స్వయంగా వెల్లడించారు. శ్రీరాముడి పాత్రతో పాటు, విష్ణుమూర్తి ఆరో అవతారమైన పరశురాముడి పాత్రను కూడా ఆయనే పోషిస్తున్నారట. “ఒకే సినిమాలో రాముడు, పరశురాముడు వంటి పురాణ పురుషుల పాత్రలు పోషించడం నా అదృష్టం. ఈ పాత్రల కోసం ఏడాది పాటు శ్రమించాను. కేవలం బాడీ లాంగ్వేజ్ మాత్రమే కాదు, వారి వెనకున్న ఆధ్యాత్మికతను కూడా అర్థం చేసుకున్నాను” అని రణ్బీర్ చెప్పుకొచ్చారు.
మరోవైపు, ఈ సినిమా బిజినెస్ లెక్కలు ఇండస్ట్రీ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. ‘రామాయణ’ రెండు భాగాల డిజిటల్ హక్కుల కోసం ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఏకంగా రూ. 1000 కోట్ల భారీ ఆఫర్ను నిర్మాత నమిత్ మల్హోత్రా ముందు ఉంచిందట. అయితే, ఆయన ఈ డీల్ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇటీవల ‘ధురంధర్’ చిత్రబృందం అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ కూడా అమలు చేయాలని నిర్మాత భావిస్తున్నారు. మొదటి భాగం విడుదలయ్యాక వచ్చే రెస్పాన్స్ను బట్టి, రెండో భాగానికి మరింత భారీ ధరకు డీల్ కుదుర్చుకోవచ్చని ఆయన ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రం దాదాపు రూ.4000 కోట్ల అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతోంది. ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ పూర్తి చేసుకుని వీఎఫ్ఎక్స్ (VFX) పనుల్లో ఉంది. ఇందులో రణ్బీర్ సరసన సీతగా సాయి పల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. అలాగే కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!