NTV Telugu Site icon

One-Nation- One Poll: ఒకే దేశం- ఒకే ఎన్నికపై రాష్ట్రపతికి నివేదిక..

One Nestion

One Nestion

Former President Kovind: భారత దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్య సాధ్యాలపై బారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ అధ్యాయనం పూర్తి అయింది. ఈ కమిటీ తుది నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇవాళ ఉదయం అందజేశారు. దేశంలో ఒకేసారి ఎన్నికలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కోవింద్ కమిటీ చెబుతోంది. ఈ మేరకు ఒకేసారి ఎన్నికల కోసం నిర్దిష్ట సిఫార్సులు చేసినట్లు తెలుస్తుంది. లోక్ సభ, అసెంబ్లీల ఎన్నికలు ఒకేసారి, మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలు మరోసారి నిర్వహిస్తే సముచితంగా ఉంటుందని కోవింద్ సారధ్యంలోని కమిటీ తెలిపింది.

Read Also: Weather Warning: పెరిగిన ఉష్ణోగ్రతలు.. అత్యవసరమైతేనే బయటకు వెళ్లండి ఐఎండి సూచన

ఇక, ఎనిమిది విభాగాల్లో సుమారు 18,000 పేజీల నివేదికను రాష్ట్రపతికి సమర్పించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రాజ్యాంగంలోని చివరి ఐదు ఆర్టికల్‌లను సవరించాలని ప్యానెల్ సిఫారసు చేయవచ్చు.. ప్రతిపాదిత నివేదిక లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి ఒకే ఓటర్ల జాబితాను కలిగి ఉండటంపై దృష్టి పెడుతుంది. గత సెప్టెంబరులో ఏర్పాటైన ఈ కమిటీ, ప్రస్తుత రాజ్యాంగ ఫ్రేమ్‌వర్క్‌ను దృష్టిలో ఉంచుకుని లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం కోసం పరిశీలించి సిఫార్సులు చేసినట్లు తెలుస్తుంది.

Read Also: Viral: ఎవర్రా మీరంతా.. ఒక్కసారిగా వధువుపై పడ్డ అతిథులు.. చివరకి..?!

కాగా, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్‌లో హోం మంత్రి అమిత్ షా, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, మాజీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే సభ్యులు కూడా ఉన్నారు. ఈ కమిటీకి న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నారు.