Ayodhya Ram Mandir : రామ్ లల్లా దీక్షలో మోడీతో పాటు పాల్గొననున్న ఈ దొం రాజా ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram Mandir : ఇప్పుడు అయోధ్యలోని రామ మందిరంలో రాంలాలా పవిత్రోత్సవానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రధాని మోడీతో పాటు దేశవ్యాప్తంగా 15 మందిని రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో విశిష్ఠ అతిథులుగా ఎంపిక చేశారు. ఇందులో కాశీకి చెందిన దోమ్ రాజా అనిల్ చౌదరి కూడా ఉన్నారు. కాశీకి చెందిన దోమ్ రాజా అనిల్ చౌదరి తన తల్లి జమునా దేవి, భార్య సప్నా చౌదరి, అతని కుటుంబ సభ్యులతో శనివారం అయోధ్య చేరుకున్నారు. ఆయన శనివారం వారణాసి నుండి బయలుదేరిన సందర్భంగా ఒక మతపరమైన ఊరేగింపు జరిగింది. ఈ సమయంలో కుటుంబ సభ్యులు వెండి త్రిశూలం, కానుకతో రామమందిరానికి బయలుదేరారు. కాశీలోని గొప్ప శ్మశాన వాటికలో కొన్నేళ్లుగా చితిమంటలను వెలిగించి, మృతదేహాలకు దహన సంస్కారాలు చేసేవాడు దోమ్ రాజా. ఈ సంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. అంతకుముందు 2019 లోక్సభ ఎన్నికల సమయంలో సామాజిక సామరస్య సందేశాన్ని అందించడానికి అప్పటి కాశీ జగదీష్ చౌదరిని తన ప్రతిపాదకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియమించారు. జూలై 2021లో ఆయన మరణించిన తర్వాత, మరణానంతరం పద్మశ్రీ అవార్డుతో గౌరవించబడ్డారు.
Read Also:Ayodhya Ram Mandir : అయోధ్యలో రాములోరి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుండగా న్యూ జెర్సీ వెళ్లిన హనుమంతుడు
Also Read
- Modi Cabinet: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఈ రాష్ట్ర నేతలకు ఛాన్స్!
- Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
- Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు.. సీఎం విజయ్ వైఖరిపై మిత్రపక్షాల్లో ఆగ్రహం..
హిందూ మత సాంప్రదాయాల ప్రకారం ఆలయ ప్రాణ ప్రతిష్ట సమయంలో అనేక క్రతువులు ఉంటాయని ఆర్ఎస్ఎస్కు చెందిన అకిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ ఇటీవల తెలిపారు. నేడు జరిగే ప్రధాన ప్రాణ ప్రతిష్ట పూజలో దేశంలోని ఉత్తర, తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఈశాన్య భాగాలకు చెందిన 14 మంది దంపతులు ముఖ్య యజమానులుగా పాల్గొంటారు. యజమానుల జాబితాలో ఉదయ్పూర్ నుంచి రామచంద్ర ఖరడి, అస్సాం నుంచి రామ కుయి జెమి, జైపూర్ నుంచి గురుచరణ్ సింగ్ గిల్, హర్దోయి నుంచి కృష్ణ మోహన్, ముల్తానీ నుంచి రమేష్ జైన్, తమిళనాడు నుంచి అదాలరసన్, మహారాష్ట్ర నుంచి విఠల్ రాము కాల్లే, మహారాష్ట్ర లాటూర్లోని ఘుమంతు సమాజ్ ట్రస్టు నుంచి మహదేవ్ రావు గైక్వాడ్, కర్నాటక నుంచి లింగరాజ్ బసవరాజ్, లక్నో నుంచి దిలీప్ వాల్మీకి, దోమ్ రాజా కుటుంబం నుంచి అనిల్ చౌదరి, కాశీ నుంచి కైలాశ్ యాదవ్, హర్యానాలోని పల్వాల్ నుంచి అరుణ్ చౌదరి, కాశీ నుంచి కవీంద్ర ప్రతాప్ సింగ్ ఉన్నారు. వీరంతా సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మత గ్రంథాలలో పేర్కొన్న విధంగా సమగ్రంగా పూజలు జరుగుతాయి.
Read Also:Ayodhya Ram Mandir LIVE : అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట లైవ్ అప్డేట్స్..
తాజావార్తలు
-
Terrorist Digital Plan: భారత్ టార్గెట్గా టెర్రరిస్టుల కొత్త ‘డిజిటల్’ ప్లాన్.. నిఘా వర్గాలకు అంతుచిక్కని మిస్టరీ!
-
Red Necked Nightjar : చందమామతో టైమ్ సెట్ చేసుకునే పక్షి.. ఇదే ప్రకృతి మ్యాజిక్.!
-
Modi Cabinet: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఈ రాష్ట్ర నేతలకు ఛాన్స్!
-
Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
-
Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!