Rajasthan Students Created world record sing patriotic songs
రాజస్థాన్లో పాఠశాల విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించి ‘ప్రపంచ రికార్డు’ నెలకొల్పారు. రాజస్థాన్లోని దాదాపు కోటి మంది పాఠశాల విద్యార్థులు శుక్రవారం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ప్రచారంలో దేశభక్తి గీతాలు ఆలపించడం ద్వారా “ప్రపంచ రికార్డు” సృష్టించారని అధికారులు తెలిపారు. సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రసంగిస్తూ.. ఈ ఘనత సాధించిన విద్యార్థులను అభినందించారు. ప్రతిష్టాత్మక సంస్థ అయిన లండన్లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోటి మంది విద్యార్థులు పాడిన పాటలను విని రాష్ట్ర ప్రభుత్వానికి సర్టిఫికేట్ అందించడం సంతోషంగా ఉందన్నారు. ‘వందేమాతరం’, ‘సారే జహాన్ సే అచా’ వంటి పాటలు, జాతీయ గీతాన్ని విద్యార్థులు దాదాపు 25 నిమిషాల పాటు ఆలపించి రికార్డు సృష్టించారు.
కొత్త తరం సోదరభావం, త్యాగం అనే విలువలను అలవర్చుకోవాలని, వారే దేశ భవిష్యత్తు అని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని తమ ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా దేశంలోని యువకులకు గెహ్లాట్ శుభాకాంక్షలు తెలిపారు. దేశ నిర్మాణంలో మన యువత కీలక పాత్ర పోషించాలి. ఈ రోజున, యువతకు అత్యుత్తమ విద్య, శిక్షణ మరియు తగిన ఉపాధి అవకాశాలను అందించడానికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాము” అని ఆయన ట్వీట్ చేశారు. జిల్లా స్థాయిలో జరిగిన కార్యక్రమాలకు సంబంధిత ఇన్చార్జి మంత్రులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
