Rajasthan : ఇన్ స్టాలో లవ్.. ఐదుగురు పిల్లలను వదిలి ప్రియుడి వద్దకు చేరిన వివాహిత
- మరో సీమా హైదర్ అయిన రాజస్థాన్ మహిళ
- ఇన్ స్టాలో ప్రేమలో పడి ప్రియుడి చెంతకు
- భర్తను ఐదుగురు పిల్లలను వదిలి గుజరాత్ కు
- అనుమానపు భర్తతో విసినపోయానన్న నమీ దేవి
Rajasthan : ప్రేమించిన వాడి కోసం పాకిస్థాన్ ను విడిచి పెట్టి గతేడాది నలుగురు పిల్లలతో భారత్కు చేరిన సీమా హైదర్ గురించి అందరికీ తెలిసిందే. రాజస్థాన్లోని జైసల్మేర్లో ఓ వివాహిత కూడా అలాంటిదే చేసింది. ఆమె దేశ సరిహద్దులు దాటలేదు, కానీ రాష్ట్ర సరిహద్దులు దాటేసింది. తన ప్రియుడి కోసం తన భర్త, ఐదుగురు పిల్లలను వదిలివేసింది. జైసల్మేర్ నుండి ఆమె గుజరాత్ చేరుకుంది. తన ప్రేమికుడితో లివ్-ఇన్ రిలేషన్షిప్లో జీవించడం మొదలు పెట్టింది. విషయం పోలీసులకు చేరడంతో భర్తతో విసిగిపోయానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆమె తన జీవితమంతా తన ప్రియుడితో గడపనుంది. త్వరలో అతడిని పెళ్లి చేసుకోనుంది.
Read Also:Israel-India: ఫస్ట్ టైం ఇజ్రాయెల్ను విమర్శించిన భారత్.. గాజాపై దాడి తప్పు అని వెల్లడి
Also Read
- Rajnath Singh: "సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం".. ఆపరేషన్ సిందూర్పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
- AP 10th Results: వాహ్!! మీరు సూపర్.. ఒకేసారి పదో తరగతి పాసైన తల్లి కొడుకులు..
- Mamata Banerjee: "ఇక మనం జాగ్రత్తగా ఉండాలి".. ఎగ్జిట్ పోల్స్ అనంతరం మమతా బెనర్జీ తొలి ప్రకటన!
- Mojtaba Khamenei: ‘‘దేవుడి దయతో అమెరికా లేని భవిష్యత్తు’’.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన..
32 ఏళ్ల నమీ దేవికి ఇన్స్టాగ్రామ్ను ఉపయోగించడమంటే చాలా ఇష్టం. ఆమె రీల్స్ కూడా చేస్తుంది. ఇన్స్టాగ్రామ్లో అతనికి 40 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో జానపద గాయకుడు భీమారామ్ను కలిశారు. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. త్వరలో వివాహం చేసుకుని అతడితో జీవించుకోవాలని అనుకుంటున్నారు. మహిళ అదృశ్యమైనట్లు భర్త ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు నమీ దేవి కోసం వెతకడం మొదలు పెట్టారు. సోదాలు జరుగుతుండగా, సోమవారం హఠాత్తుగా నమీ దేవి తన ప్రేమికుడితో కలిసి బార్మర్ జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైంది. అక్కడ తన భర్త తనను కొట్టేవాడని చెప్పింది. ఏదీ చేసిన నిత్యం తనను అనుమానించే వాడిని దీంతో తాను విసిగి పోయానని చెప్పింది.
Read Also:Sudheer Babu-Mahesh Babu: మహేష్ బాబుకి సుధీర్ బాబు ఫోన్.. ఏం మాట్లాడుకున్నారంటే?
ఏడాదిన్నర క్రితం మళ్లీ ఇన్స్టాగ్రామ్లో జానపద గాయకుడు భీమారామ్తో పరిచయం ఏర్పడింది. ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. అప్పుడు ఒకసారి మాట్లాడుకున్నారు. ఇలా మాట్లాడుకుంటూనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పుడు వారు ఇప్పుడు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. దీంతో భర్తను, ఐదుగురు పిల్లలను వదిలి ప్రియుడితో కలిసి ఉండేందుకు గుజరాత్ వెళ్లింది. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారు. ప్రస్తుతం పోలీసులు వారి వాంగ్మూలాలు తీసుకుని వదిలేశారు. అయితే ఈ వ్యవహారంపై ఇంకా విచారణ కొనసాగుతోంది. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరోవైపు ఈ ప్రేమకథపై ఇప్పుడు ఆ ప్రాంతమంతా చర్చ నడుస్తోంది.
తాజావార్తలు
-
Rajnath Singh: “సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం”.. ఆపరేషన్ సిందూర్పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
AP 10th Results: వాహ్!! మీరు సూపర్.. ఒకేసారి పదో తరగతి పాసైన తల్లి కొడుకులు..
-
Mamata Banerjee: “ఇక మనం జాగ్రత్తగా ఉండాలి”.. ఎగ్జిట్ పోల్స్ అనంతరం మమతా బెనర్జీ తొలి ప్రకటన!
-
Mojtaba Khamenei: ‘‘దేవుడి దయతో అమెరికా లేని భవిష్యత్తు’’.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన..
-
Salil Aarora: SRH కు మరో కాటేరమ్మ కొడుకు.. సలీల్ అరోరా ఎవరు..? చరిత్ర చూస్తే పూనకాలే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!