Rajasthan : ఇన్ స్టాలో లవ్.. ఐదుగురు పిల్లలను వదిలి ప్రియుడి వద్దకు చేరిన వివాహిత
- మరో సీమా హైదర్ అయిన రాజస్థాన్ మహిళ
- ఇన్ స్టాలో ప్రేమలో పడి ప్రియుడి చెంతకు
- భర్తను ఐదుగురు పిల్లలను వదిలి గుజరాత్ కు
- అనుమానపు భర్తతో విసినపోయానన్న నమీ దేవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan : ప్రేమించిన వాడి కోసం పాకిస్థాన్ ను విడిచి పెట్టి గతేడాది నలుగురు పిల్లలతో భారత్కు చేరిన సీమా హైదర్ గురించి అందరికీ తెలిసిందే. రాజస్థాన్లోని జైసల్మేర్లో ఓ వివాహిత కూడా అలాంటిదే చేసింది. ఆమె దేశ సరిహద్దులు దాటలేదు, కానీ రాష్ట్ర సరిహద్దులు దాటేసింది. తన ప్రియుడి కోసం తన భర్త, ఐదుగురు పిల్లలను వదిలివేసింది. జైసల్మేర్ నుండి ఆమె గుజరాత్ చేరుకుంది. తన ప్రేమికుడితో లివ్-ఇన్ రిలేషన్షిప్లో జీవించడం మొదలు పెట్టింది. విషయం పోలీసులకు చేరడంతో భర్తతో విసిగిపోయానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆమె తన జీవితమంతా తన ప్రియుడితో గడపనుంది. త్వరలో అతడిని పెళ్లి చేసుకోనుంది.
Read Also:Israel-India: ఫస్ట్ టైం ఇజ్రాయెల్ను విమర్శించిన భారత్.. గాజాపై దాడి తప్పు అని వెల్లడి
Also Read
- భారత్లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
- Best Mileage Bikes: లీటర్కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
- YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
- Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
32 ఏళ్ల నమీ దేవికి ఇన్స్టాగ్రామ్ను ఉపయోగించడమంటే చాలా ఇష్టం. ఆమె రీల్స్ కూడా చేస్తుంది. ఇన్స్టాగ్రామ్లో అతనికి 40 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో జానపద గాయకుడు భీమారామ్ను కలిశారు. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. త్వరలో వివాహం చేసుకుని అతడితో జీవించుకోవాలని అనుకుంటున్నారు. మహిళ అదృశ్యమైనట్లు భర్త ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు నమీ దేవి కోసం వెతకడం మొదలు పెట్టారు. సోదాలు జరుగుతుండగా, సోమవారం హఠాత్తుగా నమీ దేవి తన ప్రేమికుడితో కలిసి బార్మర్ జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైంది. అక్కడ తన భర్త తనను కొట్టేవాడని చెప్పింది. ఏదీ చేసిన నిత్యం తనను అనుమానించే వాడిని దీంతో తాను విసిగి పోయానని చెప్పింది.
Read Also:Sudheer Babu-Mahesh Babu: మహేష్ బాబుకి సుధీర్ బాబు ఫోన్.. ఏం మాట్లాడుకున్నారంటే?
ఏడాదిన్నర క్రితం మళ్లీ ఇన్స్టాగ్రామ్లో జానపద గాయకుడు భీమారామ్తో పరిచయం ఏర్పడింది. ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. అప్పుడు ఒకసారి మాట్లాడుకున్నారు. ఇలా మాట్లాడుకుంటూనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పుడు వారు ఇప్పుడు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. దీంతో భర్తను, ఐదుగురు పిల్లలను వదిలి ప్రియుడితో కలిసి ఉండేందుకు గుజరాత్ వెళ్లింది. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారు. ప్రస్తుతం పోలీసులు వారి వాంగ్మూలాలు తీసుకుని వదిలేశారు. అయితే ఈ వ్యవహారంపై ఇంకా విచారణ కొనసాగుతోంది. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరోవైపు ఈ ప్రేమకథపై ఇప్పుడు ఆ ప్రాంతమంతా చర్చ నడుస్తోంది.
తాజావార్తలు
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
-
భారత్లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
-
Best Mileage Bikes: లీటర్కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!